Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం!

తిరుమలలో మరోసారి శిలాతోరణం సమీపంలో చిరుత కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. గురువారం సాయంత్రం చిరుత కనిపించినట్లు భక్తులు తెలపడంతో అంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో అధికారులు భక్తులకు పలు జాగ్రత్తలు సూచించారు.

author-image
By Bhavana
New Update
leopard

leopard

తిరుమల (Tirumala) లో మరోసారి చిరుత (Leopard) సంచారం తీవ్ర సంచలనం రేపుతోంది.  తిరుమల శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. చిరుతను చూసిన భక్తులు.. ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పక్కన ఉన్నవారికి చెప్పడంతో వారు కూడా అలర్ట్ అయ్యారు. 

Also Read: Jayalalitha: జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే...సీబీఐ స్పెషల్‌ కోర్టు తీర్పు!

Leopard Spotted At Tirumala

ఇక చిరుత సంచారానికి సంబంధించిన సమాచారాన్ని భక్తులు.. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు తెలియజేశారు. వెంటనే టీటీడీ అధికారులు.. అటవీ శాఖ అధికారులకు సమాచారం తెలియజేశారు. హుటాహుటిన వారంతా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.ఇక ఈ చిరుత.. తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల క్యూలైన్ల సమీపంలోనే సంచరిస్తున్నట్లు టీటీడీ, అటవీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: America: వీసా గడువు ముగిసినా అమెరికాలో.. మరింత కఠినంగా నిబంధనలు, భారతీయులపై తీవ్ర ప్రభావం!

ఈ నేపథ్యంలోనే తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులను టీటీడీ అధికారులు అప్రమత్తం చేశారు. చిరుత సంచారం నేపథ్యంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దర్శనాల కోసం వచ్చే భక్తులు ఒంటరిగా వెళ్లొద్దని.. గుంపులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ అధికారులు హితవు పలికారు. తిరుమలలో మరోసారి చిరుత సంచరిస్తుండటంతో.. శ్రీవారి దర్శనానికి తిరుమలకు వెళ్లిన భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Also Read: Goreti venkanna: ఒక కమ్యూనిస్టు జీవిత చరిత్ర వంద రామాయణాలకు ధీటుగా ఉంటుంది: గోరటి వెంకన్న!

Also Read: Flipkart New Sale: ఫ్లిప్‌కార్ట్‌ న్యూ సేల్.. స్మార్ట్‌‌ఫోన్లు, ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్టులపై ఆఫర్లే ఆఫర్లు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు