/rtv/media/media_files/2025/10/29/uppada-beach-2025-10-29-14-00-56.jpg)
Uppada Beach
కాకినాడ జిల్లా(kakinada) లోని ఉప్పాడ తీర ప్రాంతంలో అపూర్వ దృశ్యం ఆవిష్కృతమవుతోంది. గత తుఫాను(cyclone montha 2025) బీభత్సం తగ్గిన తర్వాత.. తీరం వెంబడి టన్నుల కొద్దీ బంగారం(gold) కొట్టుకువస్తుందనే నమ్మకంతో స్థానికులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉప్పాడ వైపు పరుగులు తీస్తున్నారు. స్థానిక సమాచారం ప్రకారం.. బలమైన గాలులు, భారీ అలల కారణంగా సముద్ర గర్భంలో పేరుకుపోయిన వస్తువులు ఒడ్డుకు కొట్టుకువస్తున్నాయని, అందులో బంగారు ముక్కలు కూడా ఉన్నాయని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. తీర ప్రాంతంలో నివసించే కొందరు స్థానికులు ఇప్పటికే తమకు కొన్ని చిన్న చిన్న బంగారు ముక్కలు లేదా గవ్వలు, రాళ్ల మధ్య కలిసిపోయిన బంగారు రేణువులు దొరికాయని చెప్పుకుంటున్నారు.
టన్నుల కొద్దీ బంగారం..
ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు పాకడంతో. ఉప్పాడ తీరం వద్ద సందడి వాతావరణం నెలకొంది. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించిన వందలాది మంది ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరం వెంబడి గాలిస్తున్నారు. సముద్రపు ఇసుకను జల్లెడ పట్టడానికి, రాళ్ల సందుల్లో వెతకడానికి ప్రజలు తాపత్రయ పడుతున్నారు. ఈ నమ్మకానికి చారిత్రక లేదా శాస్త్రీయ ఆధారం ఏమీ లేనప్పటికీ.. తుఫానుల సమయంలో సముద్రపు అడుగు భాగం కదిలి.. అరుదైన వస్తువులు ఒడ్డుకు వస్తాయనే భావన స్థానికులలో బలంగా ఉంది. గతంలో వచ్చిన కొన్ని తుఫానుల తర్వాత కూడా ఈ విధంగా ప్రజలు తీరానికి చేరుకుని గాలించిన దాఖలాలు ఉన్నాయి.
బంగారం వేటలో ఉప్పాడ సముద్రతీరంలో జాలర కుటుంబ పిల్లలు#CycloneMontha#AndhraPradesh#uppadapic.twitter.com/oUWRizA7S0
— YK TV Network (@YKTvNetwork) October 29, 2025
బంగారం దొరికిందన్న వార్తతో ఈ విషయం తెలుసుకున్న రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు ఉప్పాడకు భారీగా చేరుకుంటున్నారు. దీంతో తీరం వద్ద అసాధారణ స్థాయిలో జనసమూహం కనిపిస్తోంది. పోలీసులు, ప్రభుత్వ అధికారులు ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. తీరం వద్ద తొక్కిసలాట జరగకుండా.. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులు భావిస్తున్నారు. నిజంగానే టన్నుల కొద్దీ బంగారం దొరుకుతుందా..? లేక ఇది కేవలం అపోహగా మిగిలిపోతుందా అనేది చూడాలి.
ఇది కూడా చదవండి: ముంచెత్తుతున్న మొంథా తుఫాన్.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ హెల్త్ సేఫ్!
అయితే మరో వైపు టన్నుల కొద్దీ బంగారం కొట్టుకువస్తుందనే వార్త కేవలం పుకారు మాత్రమే అని.. ప్రజలు ఇలాంటి వదంతులు నమ్మవద్దని పోలీసులు, రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు తీరం వద్దకు రావడం ప్రమాదకరం అని సూచించినప్పటికీ.. అదృష్టం దక్కించుకోవాలనే ఆశతో ప్రజలు ఆ హెచ్చరికలను పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఉప్పాడ తీరంలో కొనసాగుతున్న ఈ బంగారం వేట ప్రజల నమ్మకాన్ని, ఆశను మరోసారి ప్రతిబింబిస్తోంది.
ఇది కూడా చదవండి: నవంబర్లో నుంచి ఈ 3 రాశుల వారికి మంచి రోజులు స్టార్ట్.. ఆ రాశుల లిస్ట్ ఇదే!
Follow Us