Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై గుంటూరులోని నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై జనసేన నేత అడపా మాణిక్యాలరావు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

New Update
MLC Duvvada : భార్యపై ఎమ్మెల్సీ దువ్వాడ కీలక వ్యాఖ్యలు

Duvvada Srinivas

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై గుంటూరులోని నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై జనసేన నేత అడపా మాణిక్యాలరావు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేవలం గుంటూరులోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ స్టేషన్‌లలో కూడా దువ్వాడపై ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబును ప్రశ్నించకుండా ఉండేందుకు పవన్ కల్యాణ్ నెలకు రూ.50 కోట్లు తీసుకుంటున్నాడని దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు. దీంతో జనసేన శ్రేణులు దువ్వాడపై ఫిర్యాదు చేశారు. 

ఇది కూడా చూడండి: Mahesh Babu: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!

ఇది కూడా చూడండి: Agent OTT Date: హమ్మయ్య.. రెండేళ్ల తర్వాత OTTలోకి అయ్యగారి సినిమా.. అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు!

వరుస ఫిర్యాదులు..

ఏపీలో వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల పోసాని కృష్ణమురళిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. కులాలు, సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య గొడవలు, పవన్, లోకేశ్ కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాయచోటి పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని కోర్టులో హాజరు పరచగా.. కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ప్రస్తుతం రాజంపేట సబ్‌జైలులో రిమాండ్‌ ఖైదీగా పోసాని కృష్ణమురళి ఉంటున్నారు.

ఇది కూడా చూడండి: Railway Jobs: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు