Champions Trophy:  ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ vs న్యూజిలాండ్..దక్షిణాఫ్రికా ఇంటికి..

ఛాంపియన్స్ ట్రోఫీలో రెండో సెమీ ఫైనల్ ఈరోజు జరిగింది. లాహోర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ భారీ విజయం సాధించింది.  51 పరుగుల తేడాతో సఫారీల మీద గెలిచింది. ఈ మ్యాచ్ లో కీవీసీ 363 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది.

author-image
By Manogna alamuru
New Update
pak

New Zeland Vs South Africa

ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ ఫైనల్స్ కు చేరింది. మరో బలమైన ప్రత్యర్థి సౌత్ ఆఫ్రికాను సెమీ ఫైనల్స్ లో మట్టికరిపించిన న్యూజిలాండ్ ఫైనల్స్ లో భారత్ తో పోటీకి సిద్ధమైంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 363 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని సఫారీలకు ఇచ్చింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో సౌత్ ఆఫ్రికా ఫెయిల్ అయింది. బౌలర్ రబాడ కూడా హాప్ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. మామూలుగానే పాకిస్తాన్ లోని లాహోర్ స్టేడియం పరుగుల వరద పారిస్తుంది. ఇక్కడ హైయ్యెస్ట్ స్కోరు ఎప్పుడూ 320కు పైనే ఉంది. అలాంటి పిచ్ లో న్యూజిలాండ్ బ్యాటర్లు మరింత రెచ్చిపోయారు. ఏకంగా 363 పరుగులు చేసి భారీ టార్గెట్ ను దక్షిణాఫ్రికాకు ఇచ్చారు. చివరి 5 ఓవర్లలోనే కీవీస్ జట్టు 66 పరుగులు చేసింది. 

ఇద్దరు సెంచరీలు..

కీవీస్ బ్యాటర్లలో కేన్ విలియమ్స్ 102, రచిన్ రవీంద్ర 108 పరుగులతో ఇద్దరూ శతకాలు చేశారు. ఈరోజు ఇన్నింగ్స్లో కీవీస్ బ్యాటర్లు ఎక్కువ వికెట్లు కోల్పోకుండానే భారీ స్కోరును సాధించగలిగారు. ఒపెనర్ గా వచ్చిన విల్ యంగ్ ఒక్కడే తొందరగా అవుట్ అయిపోయాడు. అతనితో పాటూ ఓపెనింగ్ కు దిగిన రచిన్ రవీంద్ర, తరువాత వచ్చిన కేన్ విలియమ్స్ లు క్రీజులో పాతుకుపోయారు. ఇద్దరు బ్యాటర్లు కలిసి 164 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తరువాత వచ్చిన డారెల్ మిచెల్ కూడా బాగా ఆడడంతో భారీ స్కోరు సాధ్యమైంది. మిచెల్ 49 పరుగులు చేశాడు.  ఇతని తర్వాత వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ కూడా 44 పరుగులు చేశాడు. ఇలా మొత్తానికి 363 పరుగులు చేసి ఛాంపియన్స్ ట్రోఫీలోనే అత్యంత ఎక్కువ స్కోరును నమోదు చేశారు న్యూజిలాండ్ బ్యాటర్లు. 

భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు మొదట నిలకడగా ఆడారు. అయితే తరువాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 312 పరుగులు మాత్రమే చేయగలిగారు. సఫారీ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ 50, రస్సీ, వాన్ డర్ డస్సెన్ 69, బవుమా 56 లతో అర్ధసెంచరీలు చేశారు. 

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MI vs GT: ముంబై ఇండియన్స్‌ భారీ స్కోర్.. గుజరాత్‌ కొట్టగలదా ?

ఐపీఎల్‌ 2025లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 228 పరుగులు చేసింది. 

New Update
Mumbai Indians VS Gujarat Titans

Mumbai Indians VS Gujarat Titans

ఐపీఎల్‌ 2025లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 228 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (81), బెయిర్‌ స్టో (47), సూర్య (33), తిలక్ వర్మ (25), హార్దిక్ పాండ్యా 22 పరుగులతో రాణించారు. ఇక గుజరాత్‌ బౌలర్లలో ప్రసిద్ధ్, సాయి కిశోర్ చెరో 2 వికెట్లు తీశారు. సిరాజ్‌ ఒక వికెట్ పడగొట్టాడు. మరీ గుజరాత్‌ టైటాన్స్ ఈ భారీ స్కోర్‌ చేస్తుందా ? లేదా ? అని వేచి చూడాలి. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్‌కు క్వాలిఫైయర్‌ 1లో ఓడిపోయిన పంజాబ్‌ కింగ్స్‌తో తలపడాల్సి ఉంటుంది. అందులో గెలిచిన టీమ్‌.. ఫైనల్స్‌లో ఆర్సీబీతో ఆడాల్సి ఉంటుంది.

Also Read: యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని కలిసిన ప్రధాని మోదీ

మరోవైపు రోహిత్‌ శర్మ ఈ సీజన్‌లో రెండు భారీ రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. ఐపీఎల్‌లో మొత్తం 7 వేల పరుగులు చేశాడు. అలాగే ఐపీఎల్‌లో 300 సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు సాధించాడు. 

Also Read: కౌంట్ డౌన్ స్టార్ట్.. మిస్ వరల్డ్ కిరీటానికి చివరి పోరు! రేపే ఫైనల్స్

Gujarat Titans | mumbai-indians | rtv-news

Advertisment
Advertisment