Ap Crime: బోల్తా పడిన కూల్‌డ్రింక్ వ్యాన్.. ఇలా పట్టుకుపోతున్నారేంట్రా? -VIDEO

విజయవాడ-మచిలీపట్నం హైవేపై కూల్ డ్రింక్స్ వ్యాన్ బోల్తాపడింది. అతివేగంతో వెళ్తున్న వ్యాన్ టైర్ పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న ముగ్గురికి గాయాలు అయ్యాయి. అటువైపుగా వెళ్తున్న వాహనదారులు డ్రింక్స్ కేసులను తీసుకెళ్తున్నారు.

New Update
Cool drink van overturns on Vijayawada-Machilipatnam highway

Cool drink van overturns on Vijayawada-Machilipatnam highway

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ - మచిలీపట్నం హైవేపై కూల్‌డ్రింక్స్ కేసులతో వెళ్తున్న ఒక వ్యాన్ బోల్తా పడింది. అతి వేగంగా వెళ్లడంతో ఒక్కసారిగా టైర్ పేలింది. ఈ ఘటనతో కూల్ డ్రింక్స్ తీసుకెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. అదే సమయంలో వ్యాన్‌లో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు వ్యాన్‌లో ఉన్న డ్రింక్స్ రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోవడంతో అటువైపుగా వెళ్తున్న వాహన దారులు.. డ్రింక్స్ కేసులను తీసుకుని వెళ్తున్నారు. ఎవరికి ఎన్ని డ్రింక్స్ దొరికితే అన్నింటినీ పట్టుకుని పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Also Read: ఆపరేషన్ సిందూర్‌ను ఆపలేదు.. ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన!

Also Read: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?

ఏపీలో విషాదం

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వినుకొండ మండలం శివాపురం వద్ద లారీని మినీ లారీ గట్టిగా ఢీకొట్టింది. ఇవాళ (మంగళవారం) ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను వెంటనే సమీప హాస్పిటల్‌కు తరలించారు. 

Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్‌ కూడా మేమే

మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి

కాగా ఈ ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ స్పందించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలిచ్చారు. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడం విచారకరం అని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?

cool-drinks | latest-telugu-news | telugu-news | road-accident | vijayawada

Advertisment
Advertisment
తాజా కథనాలు