Road Accident: ఏపీలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో కారు అదుపుతప్పి రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాజేంద్ర నాయుడు అనే వ్యక్తి, మరో వ్యక్తి మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Road Accident chithoor

Road Accident chithoor

Road Accident: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం తిమ్మాజిపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేషనల్ హైవేపై శుక్రవారం ఉదయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.  పలమనేరు నుంచి వేలూరు సిఎంసి ఆసుపత్రికి వేగంగా వెళ్తున్న షిఫ్ట్ డిజైర్ కారు అదుపుతప్పి హైవే సమీపంలోని సర్వీస్ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిపై దూసుకెళ్లింది. కారు వేగం అధికంగా ఉండటంతో వాహనం పూర్తిగా అదుపుతప్పి నేరుగా వారిని ఢీ కొట్టింది.
ఈ ఘటనలో తిమ్మాజిపల్లి గ్రామానికి చెందిన రాజేంద్ర నాయుడు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతడు ఏదో పనిమీద హైవే పక్కనున్న రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 

ఇది కూడా చదవండి: ఆసీస్‌ ఆలౌట్‌.. దక్షిణాఫ్రికా టార్గెట్‌ 282

అతి వేగంతో..

మరోవైపు వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సాదరయ్య ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తున్నారు. వీరిలో ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మిగిలిన నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడ్డవారిలో ఒక చిన్న పాప కూడా ఉన్నట్లు తెలుస్తోంది.మృతుడు ఎవరో ఇంకా పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు.

ఇది కూడా చదవండి: నవ్వు చికిత్స తీసుకోండి.. హ్యాపీగా ఉండండి!

గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాహనం వేగాన్ని అదుపులో ఉంచకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం లేదా ఇతర కారణాల వలన ప్రమాదం జరిగిందా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. ఘటన స్థానంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఇది కూడా చదవండి: నా బిడ్డ, తల్లి శవాలు ఎక్కడ?: విమాన ప్రమాదంలో మరో కన్నీటి కథ!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు