Thalliki Vandanam : సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీకి గ్రీన్ సిగ్నల్..వారి ఖాతాల్లోకి రూ.15 వేలు
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు తల్లులకు కానుక గా తల్లికి వందనం నిధులు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. తల్లికి వందనం పథకం నిధులు 67 లక్షల మందికి రేపు ఖాతాల్లో ప్రభత్వం జమ చేయనుంది.