/rtv/media/media_files/2025/06/18/Sana Satheesh Nara Lokesh-36bfb150.jpg)
Sana Satheesh Nara Lokesh
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన నారా లోకేష్ కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు సానా సతీష్, లావు కృష్ణదేవరాయలు, కేశినేని చిన్ని, పెమ్మసాని చంద్రశేఖర్, బస్తిపాటి నాగరాజు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి శబరిలతో కలసి నిధుల మంజూరుకు వినతి పత్రాలు అందిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను సైతం లోకేష్ టీం కలిసింది. ఈ సందర్భంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను లోకేష్ వివరించారు. ఈనెల 21న విశాఖలో ప్రధాని మోదీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమానికి చేస్తున్న ఏర్పాట్ల గురించి తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరించి కొత్తప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని అమిత్ షాకు అందజేశారు. చంద్రబాబు సుదీర్ఘ పాలన అనుభవం ఏపీని అభివృద్ధి బాటలో నడిపిస్తుందన్నారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారుకు కేంద్ర సహకారం కొనసాగుతుందని అమిత్ షా భరోసానిచ్చారు.
Also Read : ఏపీ లిక్కర్ స్కామ్లో సంచలనం.. ఫిల్మ్ ఇండస్ట్రీతో A-8 చాణక్యకు ఉన్న లింకులేంటి?
హార్టికల్చర్ హబ్ గా రాయలసీమ..
కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ ను కలిసి పండ్లతోటల అభివృద్ధికి అన్నివిధాల అనుకూలమైన వాతావరణం కలిగిన రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని కోరారు. పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర లభించక రాయలసీమ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తాను యువగళం పాదయాత్ర సందర్భంగా ప్రత్యక్షంగా చూశానని వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా అక్కడి రైతులకు మెరుగైన రేట్లు లభించి ఆదాయం పెరిగే అవకాశం ఉందన్నారు. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అన్నదాతలకు మేలు చేసేందుకు ప్రధాని మోడీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషిచేస్తుందని, నూరుశాతం సహకారాన్ని అందిస్తానని పాశ్వాన్ జీ లోకేష్ కు తెలిపారు. యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని కేంద్రమంత్రికి లోకేష్ అందజేశారు.
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారితోనూ ఈరోజు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏడాదిపాలనలో సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మరింత వేగవంతమైన అభివృద్ధికి మీ వంతు సహాయ, సహకారాలను అందించాలని కోరారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిని వివరించారు.
Also Read: Dhanush: ధనుష్ డైరెక్షన్ లో పవన్.కళ్యాణ్ ... 'కుబేరా' ఈవెంట్ లో హీరో కామెంట్స్ వైరల్!
Also Read : రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్రదేశం: బాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్
telugu-news | ap minister nara lokesh | telugu breaking news | latest-telugu-news | today-news-in-telugu | andhra-pradesh-news