/rtv/media/media_files/2025/04/27/RBOdzRYd4lqrk2eYAn5f.jpg)
Heavy rains in Telangana.
ఈ ఏడాది భారత్ లో వర్షాలు విపరీతంగా కురవనున్నాయి. నిజం చెప్పాలంటే ఈ సారి వేసవి అసలు పెద్దగా లేదు. వాయుగుండం, అల్పపీడనాలతో వర్షాలు పడుతూనే ఉన్నాయి. దాంతో పాటూ ఈసారి నైరుతీ రుతుపవనాలు తొందరగా వచ్చాయి. దీంతో ఎప్పటి కంటే ఈ సారి వర్షాలు ఎక్కువగా పడతాయని చెబుతోంది భారత వాతావరణశాఖ. జూన్ నెలలో అత్యధిక వర్షాపాతం నమోదవుతుందని తెలిపింది. దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే 108% వర్షాలు కురుస్తాయని చెప్పింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో సగటు కంటే 106శాతం ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, చుట్టుపక్కల ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా.. వాయవ్య భారతదేశంలో సాధారణంగా, ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువగా వర్షాలు పడతాయని తెలిపింది. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఎల్ నినో స్థిరంగా ఉందని..ఇది కూడా రుతుపవనాల మీద ప్రభావం చూపిస్తుందని చెబుతోంది వాతావరణశాఖ.
బంగాళాఖాతంలో అల్పపీడనం..
వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశాకు దగ్గర లో అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. ఇది పశ్చిమబెంగాల్ వైపు కదులుతూ గురువారంలోగా తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. గురువారం నుంచి వాయుగుండంగా మారుతుందని కూడా చెబుతోంది. దీని కారణంగా ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నిన్నటి నుంచే వర్షాలు కురుస్తున్నాయి. ఇక నైరుతి రుతుపవనాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా జూన్-సెప్టెంబరు మధ్యకాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలకు అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో కూడా విపరీతంగా వర్షాలు కురవనున్నాయి.
today-latest-news-in-telugu | rains | monsoon | Andhra Pradesh | telangana | imd
Also Read: Fighter Jet: 5వ తరం జెట్ ను అభివృద్ధి చేస్తున్న ఇండియా