/rtv/media/media_files/2025/05/12/dJU9OWM0YzSy5z02Tf72.jpg)
ఓ ఇంటర్నేషన్ న్యూస్ ఛానల్ యాంకర్ పాకిస్తాన్ మంత్రులకు చుక్కలు చూపించింది. అప్ఘనిస్తాన్లో జన్మించిన యాల్డా హకీమ్ స్కై న్యూస్ ఛానల్లో యాంకర్గా పని చేస్తోంది. ఇటీవల ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండియా, పాక్ ఉద్రిక్తత సమయంలో యాల్డా పాకిస్తాన్ మంత్రులను ఇంటర్వ్యూ చేసింది. అందులో ఆమె నిస్పక్షపాతంగా ముక్కుసూటిగా ఆడిగిన ప్రశ్నలకు పాకిస్తాన్ మంత్రులు సమాధానాలు చెప్పలేక తడబడ్డారు. పాకిస్తాన్ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ని పాకిస్తాన్లో ఉగ్రవాద శిభిరాలు లేవంటారా అని ప్రశ్నించింది. పాకిస్తాన్లో ఉగ్రవాద శిభిరాలు లేవని అత్తౌల్లా తరార్ గట్టిగా వాదించారు. అయితే యాల్డా పాకిస్తాన్ రక్షణ శాఖమంత్రి ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలను గుర్తు చేశారు.
Also Read : ప్రధాని మోదీ ప్రసంగంలో మాట్లాడబోయే అంశాలు ఇవే..!
Yalda Hakim Slams Pakistani Ministers Over Terrorism
“There are no terrorist camps in Pakistan” says Pakistan’s Information Minister Attaullah Tatar.
— Yalda Hakim (@SkyYaldaHakim) May 7, 2025
I spoke to him as India fired missiles into Pakistani-controlled territory in several locations early Wednesday. India says it is targeting “terrorist infrastructure”. pic.twitter.com/3ZOEww5dkK
Also Read : ముగిసిన భారత్-పాకిస్థాన్ DGMOల చర్చలు.. ఏం తేల్చారంటే?
Sky News (@SkyYaldaHakim): “But you do admit, you do admit sir, that Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations?”
— Drop Site (@DropSiteNews) April 24, 2025
Pakistan Def. Minister: “Well, we have been doing this dirty work for United States for 3… pic.twitter.com/sv5TRkCgCZ
Also Read : భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే ఎన్ని లక్షల కోట్లంటే?
పాకిస్తాన్ రక్షణ శాఖమంత్రి ఖవాజా ఆసిఫ్ స్కై న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్లో ఉగ్రవాద శిభిరాలు ఉన్నాయని ఆమెతో చెప్పారు. పాకిస్తాన్ మూడు దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిత్సోందని రక్షణ శాఖ మంత్రి ఖజానా ఆసీఫ్ అన్నారు. ఇది తప్పు అని తెలిసినా సరే అమెరికా కోసమే చేస్తున్నామని ఆయన చెప్పారు. టెర్రరిస్ట్ గ్రూపులకు మేము నిధులు, ఆశ్రయం కల్పిస్తున్నామని ఆయన ఒప్పుకున్నారు. ఇదే విషయాన్ని ఆమె పాక్ సమాచారం మంత్రికి గుర్తు చేసింది.
జనరల్ పారిస్ ముషారఫ్, పాకిస్తాన్ మాజీ ప్రధాన జెనజీర్ భుట్టో కూడా పాకిస్తాన్ ఉగ్రవాదలకు మద్ధతు ఇస్తోందని చెప్పారు. వారి మాటలను కూడా యాల్డా మంత్రి అత్తౌల్లాకు గుర్తి చేశారు. అయితే పాకిస్తాన్లో ఉగ్రవాదం గురించి ఆ దేశ నాయకులే ఇన్ని విధాల చెప్తే ఎలా అని యాంకర్ యాల్డా హకీమ్ నిలదీశారు. ఆమెలో ఆ ప్రశ్నించే తీరు అందరికీ బాగా నచ్చింది. సోషల్ మీడియాలో పలువురు ప్రసంశలు కురింపించారు. ప్రస్తుతం యాల్డా హకీమ్ సోషల్ మీడియాలో సెలబ్రెటీ అయ్యారు.
Also Read : పాక్ అణుస్థావరాలను నాశనం చేసిన భారత్?
(anchor Yalda Hakim | military tension | india pakistan escalation | pakistan ministers | latest-telugu-news | india pak war)