Stock Market : జమ్మూ కశ్మీర్ లోని పహెల్గాం లో ఉగ్రదాడుల అనంతరం భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో గతవారం స్టాక్ మార్కెట్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. కాగా శనివారం రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. అన్ని రంగాలూ లాభాల్లో దూసుకెళ్లాయి. సెన్సెక్స్ ఏకంగా 2975 పాయింట్లకు చేరుకోగా, నిఫ్టీ కూడా 872 పాయింట్లు పెరగడం గమనార్హం. ఈ రోజు ఇన్వెస్టర్లు భారీ లాభాలను సొంతం చేసుకున్నారు.
Also Read: హైదరాబాద్లో కరాచీ బేకరి ధ్వంసం.. పేరు మారుస్తారా? బోర్డు తీస్తారా? - వీడియో!
భారత స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. భారత్, పాక్ కాల్పుల విమరణ ప్రభావం మార్కెట్ పై స్పష్టంగా కనపడింది. దీంతో మార్కెట్ 3.74% వృద్ధిని సాధించింది. ఇదే సమయంలో నిఫ్టీ 50 కూడా 872.9 పాయింట్లు లేదా 3.66% పెరిగి 24,830.75 వద్ద స్థిరపడింది. ఈ భారీ లాభాలు దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ క్యాపిటలైజేషన్లో మదుపర్లకు దాదాపు రూ.16 లక్షల కోట్ల వరకు లాభాలు సొంతమయ్యాయి.
ఇది కూడా చూడండి: ఏపీలో పదవుల జాతర.. 22 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. లిస్ట్ ఇదే!
గతవారం ఇండియా పాక్ల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో నష్టాలు చవిచూసిన మార్కెట్ ఈ వారంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో ఇన్వెస్టర్లలో ఆత్మవిశ్వాసం పెరిగింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఆగిపోవడంతో భౌగోళిక రాజకీయ ఒత్తిడి కూడా తగ్గింది. దీంతో పెట్టుబడిదారులకు విశ్వాసం పెరిగింది. ఈ సానుకూల వాతావరణం మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్ను మరింత పెంచేలా చేసింది. దీనికి తోడు అమెరికా -చైనా మధ్య నెలకొన్న వాణిజ్య ఒత్తిడి తగ్గడం, రెండు దేశాలు కూడా సుంకల తగ్గింపునకు నిర్ణయించడం కూడా కారణమైంది. మరో వైపు భారత్-అమెరికా మధ్య సంభావ్య వాణిజ్య ఒప్పందాల గురించిన ప్రచారాలు మార్కెట్ను మరింత ఉత్తేజపరిచాయి.
Also Read : రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్... ఇనుప రాడ్డుతో గుండెల్లో గుచ్చి దారుణంగా..
ఇక ఈరోజు బ్యాంకింగ్, ఐటీ, ఎనర్జీ, ఆటోమొబైల్ సెక్టర్లు లాభాల్లో కొనసాగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 6.2% పెరిగి సెన్సెక్స్ ర్యాలీకి సపోర్ట్ చేసింది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 3.8% పెరిగి 55,200 స్థాయిని తాకింది, ఇది బ్యాంకింగ్ సెక్టార్లో బలమైన రికవరీని సూచించింది. దీంతోపాటు HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ వంటి భారీ స్టాక్స్ 4 నుంచి 5% లాభాలను నమోదు చేశాయి. ఇదే సమయంలో పీఎస్యూ బ్యాంకులు కూడా రాణించాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వంటి స్టాక్స్ 5-7% లాభాలతో ముగిశాయి. టూరిజం, హాస్పిటాలిటీ స్టాక్స్ కాల్పుల విరమణ వార్తలతో 4-6% పెరిగాయి. మరోవైపు విరమణ ఒప్పందం ఉత్తర భారతదేశంలో పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
ఇది కూడా చూడండి: రాజస్థాన్ పై పాక్ డ్రోన్ దాడులు.. కలెక్టర్ కీలక ప్రకటన- LIVE VIDEO
ఈ ప్రభావం విదేశీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (FIIలు)ను కూడా ఆకర్శించింది. దీంతో వారు ఈరోజు రూ.3,500 కోట్ల నికర కొనుగోళ్లు చేశారు. ఇదే సమయంలో దేశీయ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (DIIలు) కూడా రూ.2,800 కోట్ల విలువైన షేర్లను కొన్నారు.కొన్ని కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలతోనూ మార్కెట్ను ఆకర్షించే ప్రయత్నం చేశాయి. బజాజ్ ఎలక్ట్రికల్స్ నికర లాభం రూ.59.05 కోట్లకు చేరుకుని 14.78% పెరిగింది. ఈ జోష్ ఇలాగే కొనసాగితే రాబోవు రోజుల్లో మార్కెట్ మరింత పుంజుకునే అవకాశం ఉంది.
Also Read: పుల్వామా నిందితులను లేపేసాం - ఇండియన్ ఆర్మీ మరో సంచలన ప్రకటన