Viral: మద్యం మత్తులో ఖాకీల కొట్లాట...హోంగార్డుపై కానిస్టేబుల్‌ దాడి

మాచర్లలో విధుల్లో ఉన్న హోంగార్డుపై మద్యం తాగిన ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ లాఠీతో దాడి చేసిన ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. క్రిస్మస్‌ రోజున హోంగార్డు శ్రీనివాసరావు కానిస్టేబుల్‌ను చూసి ఇక్కడికెందుకు వచ్చారని అడిగారు.

New Update
CONSITABLE ATTACK

CONSITABLE ATTACK Photograph

CONSITABLE ATTACK :  విధుల్లో ఉన్న హోంగార్డుపై ఫూల్‌గా మద్యం తాగిన ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ లాఠీతో దాడి చేశాడు. ఈ ఘటన సోషల్‌ మీడియాలో  వైరల్‌ అవుతోంది.  ఈ ఘటన మాచర్ల పట్టణంలో ఈనెల 25న రాత్రి 11 గంటల ప్రాంతంలో చోటుచేసుకున్న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్రిస్మస్‌ పండగ రోజున ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ మల్లికార్జునరావు ఫూల్‌గా మద్యం తాగి రోడ్డుపై ఉన్నాడు. ఆ సమయంలో విధులు నిర్వహించేందుకు వచ్చిన హోంగార్డు శ్రీనివాసరావు కానిస్టేబుల్‌ను చూశారు.

Also Read :  మందుబాబులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన రేవంత్‌ సర్కార్

తాగిన మత్తులో..

Also Read :  తండ్రి మోసం కూతురి మరణం కేసు.. ముగ్గురు నిందితులకు రిమాండ్!

అతనిని ఇక్కడికెందుకు వచ్చారని అడిగారు. దీంతో ఆగ్రహానికిలోనై కానిస్టేబుల్‌ లాఠీతో హోంగార్డుపై దాడి చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోవటంతో వారిపై దుర్భాషలాడుతూ వెళ్లిపోయాడు. ఈ ఘటనపై పట్టణ సీఐ ప్రభాకరరావు మాట్లాడుతూ.. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని.. ఇప్పటికే వివరణలు తీసుకున్నారు. తర్వలోనే ఈ ఘటనపై ఓ నివేదికలను ఉన్నతాధికారులకు పంపించామని సీ సీఐ ప్రభాకరరావు  వెల్లడించారు

Also Read :  BNSL నుంచి ఫ్రీ OTT : 300 ఛానల్స్, మూవీస్, వెబ్ సిరీస్ ఎంజాయ్

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. 

ఇది కూడా చదవండి: ట్రైలర్‌ రిలీజ్‌ చేయాలంటూ ఫ్యాన్‌ సూసైడ్‌ లెటర్‌

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు