/rtv/media/media_files/2025/01/21/2UBPrgNrxdIJoDqhHP8W.jpeg)
Venu Swamy Apology
హీరో నాగచైతన్య పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్న వేణు స్వామి..
— RTV (@RTVnewsnetwork) January 21, 2025
గతంలో నాగచైతన్య, శోభిత లు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని జోష్యం చెప్పిన వేణు స్వామి..
ఇద్దరూ మళ్లీ విడాకులు తీసుకుంటారని జ్యోతిష్యం చెప్పిన వేణు స్వామి...
వేణు స్వామి వ్యాఖ్యలపై ఉమెన్ కమిషన్ కి… pic.twitter.com/7omuttT8lM
Also Read: డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దు
వేణు స్వామికి(Venu Swamy) ఉమెన్ కమిషన్ హెచ్చరిక
కాగా వేణుస్వామి వ్యాఖ్యలపై ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ ఉమెన్ కమిషన్ కి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన తెలంగాణ ఉమెన్ కమిషన్ వేణు స్వామి కి నోటీసులు జారీచేసింది. ఉమెన్ కమిషన్ నోటీసులను సవాలు చేస్తూ వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు స్టే విధించింది. తాజాగా గతంలో ఇచ్చిన కోర్టు స్టేను ఎత్తివేయడంతో పాటు కోర్టు సైతం ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. కోర్టు ఆదేశాల మేరకు మహిళా కమిషన్ మరోసారి నోటీస్ జారీ చేసింది. ఈ నెల 14వ తేదీన కమిషన్ ముందు హాజరవ్వాలని నోటీసులో పేర్కొంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వేణుస్వామి మంగళవారం ఉమెన్ కమిషన్ కార్యాలయానికి హాజరై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఉమెన్ కమిషన్ కు బహిరంగ క్షమాపణలు కోరారు. కాగా ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కావొద్దని వేణు స్వామిని ఉమెన్ కమిషన్ హెచ్చరించింది.
Also Read: లోకల్ బాడీ ఎలక్షన్లపై ఫేక్ ప్రచారం.. మరో మూడు నెలలు ఆగాల్సిందేనట!
సెలబ్రేటీల జీవితాల గురించి తరుచూ జ్యోతిష్యాలు చెబుతూ వేణుస్వామి విమర్శల పాలయ్యారు. గతంలో అక్కినేని హీరో నాగ చైతన్య, స్టార్ హీరోయిన్ సమంత ప్రేమ పెళ్లి చేసుకున్నా విడిపోతారని ఆయన జ్యోతిష్యం చెప్పాడు. అయితే, కారణాలు ఏవైనా ఆయన చెప్పినట్లుగానే నాగ చైతన్య, సమంత విడిపోయారు. ఇటీవల నాగ చైతన్య శోభిత దూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నా విడిపోతారని వేణుస్వామి జాతకం చెప్పాడు. దీంతో వేణుస్వామి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
Also Read: Akkineni Akhil: అఖిల్ పెళ్ళి డేట్ ఫిక్స్.. ఆరోజు నుంచి ఘనంగా పెళ్లి వేడుకలు