AP assembly:ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరిరోజున కీలక బిల్లులు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఐదు రోజులపాటూ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. చివరి రోజు సభలో రెండు కీలక బిల్లులను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

New Update
BREAKING: ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజుకు చేరుకున్నాయి. టీడీపీ నిరసనలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు, విజిల్స్, అరుపులు, కేకలతో.. రెండు రోజులు సమావేశాలు వాడివేడిగా సాగాయి, ఆ తర్వాత ప్రతిపక్షం లేని సమావేశాలు మరో రెండు రోజులు కొనసాగాయి. ఈ రోజు ఆఖరు రోజు. సభలో నేడు రెండు కీలక బిల్లులు ప్రవేశ పెట్టనుంది జగన్ ప్రభుత్వం. సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడే అవకాశముంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం అవుతుంది. తర్వాత మూడు అంశాలపై అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చ జరుగుతుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్పులో అక్రమాలపై అధికార పార్టీ సభ్యులు చర్చిస్తారు. ఆరోగ్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, దేవాలయాల అభివృద్ధి-ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కూడా స్వల్ప కాలిక చర్చ జరుగుతుంది.

ఇక చివరి రోజు సభలో రెండు కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లు-2023, ఏపీ అప్రోప్రియేషన్ బిల్లు-2023లను సభలో ప్రవేశ పెడతారు. ప్రభుత్వ సెక్యూరిటీస్ యాక్ట్-2006ను సవరించాలని కేంద్రానికి కోరుతూ సభలో ఈరోజు తీర్మానం ప్రవేశపెడతారు.

మరోవైపు శాసన మండలి సమావేశాలు కూడా ఋరోజు ముగియనున్నాయి. ఉదయం పది గంటలకు మండలి ప్రారంభం అవుతుంది. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం, మండలి ముందుకు సివిల్ కోర్టుల చట్ట సవరణ బిల్లు వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాంపై మండలిలో ఈ రోజు కూడా చర్చ కొనసాగుతుంది. వైద్య, ఆరోగ్య రంగాల్లో అభివృద్ధి పై స్వల్ప కాలిక చర్చలు జరుగుతాయి. ప్రభుత్వ సెక్యూరిటీ యాక్ట్ 2006ను సవరించాలని కేంద్రానికి కోరుతూ సభలో ఏపీ ప్రభుత్వం తీర్మానంపెట్టనుంది.

ఇవికూడా చదవండి: మీకు దమ్ముంటే ఆధారాలు చూపించండి…కెనడాకు భారత్ సవాల్..!!

మణిపూర్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు…మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత..!!

Advertisment
తాజా కథనాలు