/rtv/media/media_files/2025/01/29/4oZuGBKMOiRnEc8Kunaf.jpg)
Mohammad Sajid
ఈ మధ్య అమెరికాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో భారతీయ విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపుతోంది. అయితే తాజాగా హైదరాబాద్కు చెందిన మరో యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఖైరతాబాద్కు చెందిన మహమ్మద్ వాజిద్ ఉన్నత చదువుల కోసం నాలుగేళ్ల క్రితం యూఎస్ వెళ్లాడు. పేద కుటుంబానికి చెందిన వాజిత్ పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూనే తన చదువు కొనసాగించాడు.
Also Read: ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు..AI సహాయంతో పంపిణీ!
అంతేకాదు గతంలో కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ డివిజన్ యువజన నాయకుడిగా కూడా పనిచేశారు. ఎన్ఆర్ఐ కాంగ్రెస్ మైనార్టీ విభాగంలో అతడు కీలక పాత్ర పోషిస్తున్నడు. అయితే భారత కాలమాన ప్రకారం.. బుధవారం ఉదయం చికాగోలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వాజిద్ మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందింది. సికింద్రాబాద్ మాజీ ఎంపీ అనిల్ కుమార్, పలువురు కాంగ్రెస్ నేతలు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహమ్మద్ వాజిద్ మృతదేహం అమెరికా నుంచి భారత్కు రప్పించేందుకు పనులు జరుగుతున్నాయి.
Also Read: హైదరాబాద్లో రేపు చికెన్, మటన్ షాపులు బంద్.. ఎందుకో తెలుసా?
ఇదిలాఉండగా ఇటీవలే హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేటకు చెందిన బండి వంశీ(25) అనే విద్యార్థి కూడా అమెరికాలో అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. అతను ఉంటున్న అపార్ట్మెంట్ కింద సెల్లార్లోని కారులో వంశీ అనుమానస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. అలాగే మరికొందరు తెలుగు విద్యార్థులు కూడా అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన సందర్భాలున్నాయి.
Also Read: మహా కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి.. యోగీ సర్కార్ సంచలన ప్రకటన
Also Read: ఎలా పడతార్రా బాబు.. పులి మూత్రం బాటిల్ రూ.600- కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!