Raghunandan Rao: ఎలాగైనా నిన్ను లేపేస్తాం... రఘునందన్‌కు మరోసారి బెదిరింపు కాల్స్‌

భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్‌రావుకు మరోసారి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. మావోయిస్టుల నుంచి గతంలో ఒకసారి  బెదిరింపు కాల్స్‌ రావడంతో ఆయనకు అదనపు భద్రత కల్పించాలని పోలీసులు నిర్ణయించారు. అయినా మరోసారి ఆయనకు బెదిరింపు కాల్స్‌ రావడం సంచలనం సృష్టించింది.

New Update
Raghunandan Rao

Raghunandan Rao

Raghunandan Rao : భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్‌రావుకు మరోసారి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. మావోయిస్టుల నుంచి గతంలో ఒకసారి  బెదిరింపు కాల్స్‌ రావడంతో ఆయనకు అదనపు భద్రత కల్పించాలని పోలీసులు నిర్ణయించారు. అయినా మరోసారి ఆయనకు బెదిరింపు కాల్స్‌ రావడం సంచలనం సృష్టించింది.‘ఆపరేషన్‌ కగార్‌’ ఆపాలంటూ రెండు వేర్వేరు నంబర్ల నుంచి వ్యక్తులు ఫోన్‌ చేశారు. ఏపీ మావోయిస్టు కమిటీ ఆదేశాల మేరకు 5 బృందాలు రంగంలోకి దిగాయని వారు తెలిపారు. ఆపరేషన్ కగార్‌ను తక్షణమే ఆపకపోతే చంపేస్తామని ఈ సందర్భంగా మావోయిస్టులు హెచ్చరించారు తమ టీమ్‌లు హైదరాబాద్‌లో ఉన్నాయని.. మరికాసేపట్లో చంపేస్తామని హెచ్చరించారు. దమ్ముంటే కాపాడుకోవాలన్నారు. మా ఫోన్లు ట్రేస్‌ చేసేందుకు యత్నిస్తున్నారని.. తమ సమాచారం దొరకదని చెప్పారు. ఇంటర్నెట్‌ కాల్స్‌ వాడుతున్నామని.. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమన్నారు. 

Also Read :  బీచ్ లో చిల్ అవుతున్న స్టార్ కపుల్! సూర్య కొత్త లుక్ అదిరింది

Also Read: Sexual Harassment : ఉద్యోగం ఆశ జూపి అత్యాచారం..పద్మ అవార్డు గ్రహీతపై ఆరోపణలు

Raghunandan Receives Threatening Calls

కాగా, రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో రఘునందన్‌ కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఈ ఫోన్‌ కాల్ వచ్చింది. జూన్‌ 23న ఎంపీకి తొలిసారి బెదిరింపు కాల్‌ వచ్చింది. దీంతో ఆయన డీజీపీ, మెదక్‌, సంగారెడ్డి ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. ఈ బెదిరింపు కాల్స్‌పై క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన పోలీసు శాఖ, ఆయనకు అదనపు భద్రత అవసమని నిర్ణయించింది.  బెదిరింపుల నేపథ్యంలో రఘునందన్‌రావుకు ప్రభుత్వం ఎస్కార్ట్‌ వాహనంతో పాటు అదనపు సిబ్బందితో రక్షణ కల్పించింది. ఆదివారం మళ్లీ బెదిరింపు కాల్స్‌ రావడంతో రఘునందన్‌రావు మరోసారి ఆస్పత్రి నుంచే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: మళ్లీ ఉగ్రవాద శిబిరాలు నిర్మిస్తున్న పాకిస్థాన్.. వెలుగులోకి సంచలన నిజాలు

రఘునందన్‌రావుకు వరుసగ మావోయిస్టుల నుంచి కాల్స్ రావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంశమైంది. అవి ఫేక్‌ కాల్స్ అని కొంతమంది అంటుండగా, మరికొంతమంది మాత్రం మావోయిస్టులు  కాల్స్‌ చేసే అవకాశం లేదని, కావాలనే ఆయనకు పడనివారు అలా చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే.. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రారంభం నిమిత్తం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తున్న సమయంలోనే మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్స్ రావడం గమనార్హం.

Also Read: నా కొడుకు వీర్యాన్ని అప్పగించండి.. కోర్టులో తల్లి వింత పిటిషన్

 

Anti-Maoist Operation | maoist-party | maoist-party-letter | Maoist Prime Leader | operation kagar | operation kagar in chathisghad | stop opretation kagar

Advertisment
Advertisment
తాజా కథనాలు