/rtv/media/media_files/2025/06/28/bombay-high-court-2025-06-28-15-06-48.jpg)
Bombay High Court
Bombay High Court - Sperm Case:
బాంబే హైకోర్టులో ఓ వింత పిటిషన్ దాఖలయ్యింది. చనిపోయిన తన కొడుకు వీర్యాన్ని నాశనం చేయకుండా అప్పగించాలని కోరుతూ ఓ తల్లి కోర్టును ఆశ్రయించింది. పెళ్లి చేసుకోకుండానే తన కొడుకు క్యాన్సర్తో మృతి చెందాడని పిటిషన్లో చెప్పింది. తమ కుటుంబ వారసత్వాన్ని నిలుపుకునేందుకు వాటిని తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేసింది.
Also Read: ఉద్యోగం ఆశ జూపి అత్యాచారం..పద్మ అవార్డు గ్రహీతపై ఆరోపణలు
తన కొడుకు కుటుంబాన్ని సంప్రదించకుండానే తాను చనిపోయిన తర్వాత వీర్యాన్ని నాశనం చేయాలని సంతాన సాఫల్య కేంద్రం (IVF)లోని సమ్మతి పత్రాలపై సంతకం చేసినట్లు తెలిపింది. అందుకే తమ కొడుకు వీర్యాన్ని అప్పగించాలని కోరింది. అయితే దీనిపై బాంబే హైకోర్టు(Bombay High Court)లో జస్టిస్ మనీష్ పటేల్తో కూడిన ఏకసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. తుది తీర్పు వచ్చేవరకు వీర్యాన్ని కాపాడాలని సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆదేశించింది.
Also Read: ‘నా భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకునే వరకు మంగళసూత్రాన్ని తీయను’
తదుపరి విచారణను జులై 30కి వాయిదా వేసింది. కొడుకు మరణాంతరం వీర్యాన్ని గుజరాత్కు చెందిన IVF కేంద్రానికి తరలించాలని ముంబైలోని సంతాన సాఫల్య కేంద్రాన్ని సదరు మహిళ ఆశ్రయించింది. దీంతో అసలు విషయం ఆమెకు తెలిసింది. ఈ క్రమంలోనే ఆమె తన కొడుకు వీర్యాన్ని నాశనం చేయకుండా అప్పగించాలని కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించింది.
Also Read: Sexual Harassment : ఉద్యోగం ఆశ జూపి అత్యాచారం..పద్మ అవార్డు గ్రహీతపై ఆరోపణలు