/rtv/media/media_files/2025/06/28/pakistan-rebuilding-terror-camps-2025-06-28-18-20-22.jpg)
Pakistan rebuilding terror camps
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్కు చెందిన 9 కీలక ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఆ తర్వాత పాక్.. భారత్పై డ్రోన్లతో దాడులకు పాల్పడగా భారత ఆర్మీ వాటిని తిప్పికొట్టి ప్రతిదాడులు చేసింది. అయితే పాకిస్థాన్కు సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. వాళ్లు మళ్లీ ఉగ్రస్థావరాలను పునరుద్ధరిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.
Also Read: ఇజ్రాయిల్ ప్రధాని ప్లాన్ ఇదే.. యుద్ధాలతో ప్రజల్ని మార్చుతున్న నెతన్యాహు
ఉగ్రవాద లాంచ్ప్యాడ్లు, శిక్షణా శిబిరాలు మళ్లీ స్థాపించేందుకు పాక్ అధికారులు చురుకుగా పనిచేస్తున్నట్లు సమాచారం. '' పీవోకే, పాక్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను మళ్లీ నిర్మించేందుకు అక్కడి ప్రభుత్వం, దాని నిఘా సంస్థ ISI.. నిధులు సేకరిస్తూ ఉగ్రసంస్థలకు సహకరిస్తున్నాయి. ఇతర దేశాలు నుంచి వైమానిక దాడులను తప్పించుకునేందుకు నియంత్రణ రేఖ (LOC) దగ్గర్లో దట్టమైన అడవుల్లో ఈ శిబిరాలు నిర్మిస్తున్నాయి. జమిలా పోస్ట్, ఉమ్రాన్వాలి, చాప్రార్, ఫార్వర్డ్ కహుటా,లుని, పుట్వాల్ తదితర ప్రాంతాల్లో వీటిని నిర్మిస్తున్నాయి. ఈ ఉగ్ర శిబిరాల్లో థర్మల్ ఇమేజర్లు, ఉపగ్రహ నిఘాను ఎదుర్కొనేందుకు అధునాతన సాంకేతిక పరికరాలు అమరుస్తున్నట్లు తెలిసిందని'' నిఘా వర్గాలు వెల్లడించాయి.
Also Read: నా కొడుకు వీర్యాన్ని అప్పగించండి.. కోర్టులో తల్లి వింత పిటిషన్
ఇదిలాఉండగా ఆపరేషన్ సిందూర్లో తొమ్మిది ఉగ్రస్థావారాలపై భారత ఆర్మీ దాడులు చేసింది. వీటిలో రెండు కీలక ఉగ్రస్థావరాలు ఉన్నాయి. ఒకటి మర్కజ్ తొయిబా మదర్సా. దీన్ని లష్కరే తొయిబా ప్రధాన కార్యాలయంగా కూడా వాడుతుంటారు. ఇక ఉస్మాన్ ఓ అలీ అనే మరో ఉగ్రశిబిరం కూడా జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు ఎంతో ముఖ్యమైంది. ఈ దాడులతో వారికి కోలుకోలేని దెబ్బ తగిలింది. అయితే తాజాగా మళ్లీ ఉగ్రస్థావరాలను నిర్మించడం చర్చనీయాంశమవుతోంది.