/rtv/media/media_files/2025/04/08/JPaqN9MDVJaznUvZJH44.jpg)
TSRTC bus overturning accident
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు దగ్గర టీఎస్ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయాలు కాగా.. మరో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
TGSRTC Warangal Bus Accident
బోల్తాపడ్డ ఆర్టీసీ బస్సు.. 15 మంది ప్రయాణికులకు గాయాలు
— Telugu Scribe (@TeluguScribe) April 8, 2025
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు వద్ద బోల్తాపడ్డ ఆర్టీసీ బస్సు
ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులకు గాయాలు
గాయపడ్డవారిని వరంగల్ ఎంజిఎంకు తరలింపు
ఒంగోలు నుండి ఆదిలాబాద్ వెళ్తుండగా తెల్లవారుజామున ఘటన pic.twitter.com/G2VMpGU6Jx
ఇది కూడా చదవండి: పాపం ప్రణీత్.. గంట పాటు చిత్ర హింసలు పెట్టి చంపిన ఫ్రెండ్స్.. అసలేమైందంటే..!
క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బస్సు ఒంగోలు నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేస్తుంది. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి: ఆఫీసు పనిలో సహోద్యోగులు ఎగతాళి చేస్తున్నారా.. ఇలా చేయండి
latest-telugu-news | today-news-in-telugu | telangana crime news | telangana crime case | telangana-crime-updates