అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ నేపథ్యంలో అలేఖ్య చిట్టి తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో చేరింది. ఆమె బ్రీతింగ్ ఇబ్బందితో ప్రస్తుతం ICUలో ఉంది. ఈ క్రమంలో అలేఖ్య చెల్లి రమ్య ఒక ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసింది.
అంతా వాల్లే చేశారు
‘‘మా అక్క అలేఖ్య చిట్టి తాను చేసిన తప్పుకు పర్సనల్గా అలాగే పబ్లిక్గా అందరికీ క్షమాపణలు చెప్పింది. దాన్ని కూడా మీమర్స్, యూట్యూబర్స్ వాళ్లు నెగెటివిగ్ స్ప్రెడ్ చేసేశారు. తాను వాటివల్ల తీవ్ర డిప్రెసన్లోకి వెళ్లిపోయి ఇప్పుడు హాస్పిటల్ పాలైంది. దానికి కారణం మీరే.
Also Read: క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!
ఒక ఆడపిల్లను ఇంతగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మమ్మల్ని బతకనివ్వరా. ఇప్పటికే అలేఖ్య మొయ్యాల్సిన భారాన్ని మోస్తుంది. దాన్ని మేము కల్లారా చూస్తున్నాం. తనని ఒక్కదాన్ని వదిలితే ఏమవుతుందా అని ఇన్ని రోజులు భయపడుతూనే వస్తున్నాం. ఏదైతే అవకూడదో.. అదే చేశారు.
Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!
మా అక్కకి ఏదైనా జరిగితే
తనని హాస్పిటల్ పాలు చేశారు. మా ఇంట్లో ఆల్రెడీ మా నాన్న చనిపోయి 3 నెలలు కూడా కాలేదు. ఈలోపే ఇంకొకరిని హాస్పిటల్ పాలు చేశారు. మా అక్కకి ఏదైనా జరిగితే మీరు రెస్పాన్స్బుల్టీ తీసుకుంటారా?. మేము నిండా మునిగిపోయాము.. మమ్మల్ని రోడ్డు మీదకు లాగేశారు.
Also Read: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!
మేమంతా ఆడవాళ్లమే కదా.. మీ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉంటారు కదా. దయచేసి ఇక్కడితో ట్రోల్స్, మీమ్స్ ఆపేయండి. మేము మిమ్మల్ని అడుక్కుంటున్నాం. ఇకనైనా ఇక్కడితో ఆపేయండి’’ అంటూ అలేఖ్య సిస్టర్ రమ్య ఒక ఎమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం అది వైరల్గా మారింది.
Also Read: పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు
(alekhyaa chitti pickle | alekhya chitti pickles controversy | latest-telugu-news | telugu-news)