/rtv/media/media_files/2025/05/14/LqWbJE3mBF3NruY8tLbd.jpg)
Miss World 2025
Miss world 2025: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న ప్రపంచ సుందరి-2025 పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. విశ్వసుందరి కిరీటం దక్కించుకునేది ఎవరో తేలే సమయం ఆసన్నమైంది. హైదరాబాద్లో అట్టహాసంగా జరుగుతున్న మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ పోటీల గ్రాండ్ ఫినాలె (ఫైనల్స్) శనివారం రాత్రి జరగబోతోంది. హైటెక్స్ వేదికగా సాగే ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన 40 మంది పోటీలో నిలవబోతున్నారు. వారిలో ఒకరు ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి బ్లూ క్రౌన్ను సొంతం చేసుకోనున్నారు.కాగా కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు 108 దేశాల అందాలభామలు పోటీపడగా ఫైనలో 40 మంది నిలిచారు. వారిలో ఒకరు మాత్రమే కిరీటాన్ని సొంతం చేసుకోనున్నారు. కాగా ఆ లిస్టులో మిస్ ఇండియా నందిని గుప్తా కూడా ఉన్నారు.
Bengaluru: ఎవడ్రా వీడు.. ముగ్గురు భార్యలు - 9 మంది పిల్లల కోసం ఇలా చేశావేంట్రా!
ఇక ఈరోజు జరగనున్న ఫైనల్ పోటీలకు రంగం సిద్దమైంది. విశిష్ట అతిథులు.. బాలీవుడ్ తారల ప్రదర్శనల నడుమ హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా శనివారం మిస్వరల్డ్ పోటీల ఫైనల్ జరగనుంది. మిస్ ఇండియా నందిని గుప్తా సహా 16 మంది అందాల భామలు ఇప్పటికే టాప్ 40కి చేరుకున్నారు. మరో 24 మందిని న్యాయనిర్ణేతలు శనివారం ఎంపిక చేయనున్నారు. వీరితో పాటు చివరి దశలో అమెరికా- కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా-ఓషియానా ఖండాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తారు. ఈ నలుగురిలో తుది ప్రశ్న ద్వారా మిస్వరల్డ్ను ప్రకటిస్తారు. మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిజ్కోవా 72వ ప్రపంచ సుందరికి కిరీటాన్ని ధరింపజేస్తారు. కాగా ప్రస్తుతం మిగిలిన 40 మంది నుంచి వివిధ పద్ధతుల ద్వారా ఒక్కో ఖండం నుంచి ఐదుగురు చొప్పున మొత్తం 20 మందిని ఎంపిక చేస్తారు. సెమీ ఫైనల్స్లో ఒక్కో ఖండం నుంచి ఇద్దరు చొప్పున మొత్తం 8 మంది ఫైనల్స్కు ఎంపికవుతారు. వీరినుంచి తొలి విజేతను, మొదటి, రెండు, మూడో రన్నరప్లను ప్రకటిస్తారు.
Also Read: ఇండియాలో సివిల్ డిఫెన్స్ మాక్డ్రిల్ వాయిదా.. ఎందుకంటే?
1951లో ప్రారంభమైన మిస్ వరల్డ్ పోటీలకు మనదేశం అతిథ్యమివ్వడం ఇది మూడో సారి తొలిసారి 1996లో బెంగళూరులో జరగగా, గతేడాది ముంబయిలో నిర్వహించింది. ఈసారి హైదరాబాద్ వేదికైంది. ఇక మనదేశం నుంచి ఇప్పటివరకు ప్రపంచ సుందరి కిరీటాన్ని ఆరుగురు సొంతం చేసుకున్నారు. వారిలో రీటా ఫారియా(1966), ఐశ్వర్యారాయ్ (1994), డయానా హెడెన్(1997), యుక్తాముఖి(1999), ప్రియాంక చోప్రా(2000), మానుషి చిల్లర్(2017) కిరీటాన్ని దక్కించుకున్నారు.
Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్
ఇక మిస్ వరల్డ్ పోటీల ఫైనల్కు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా పలువురు మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు వేడుకను ప్రత్యక్షంగా తిలకించనున్నారు. విజేతగా నిలిచే కొత్త ప్రపంచ సుందరికి ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టీనా పిష్కోవా (చెక్ రిపబ్లిక్) దాదాపు రూ.6.21 కోట్ల విలువైన బ్లూ క్రౌన్ను అలంకరించనున్నారు. శనివారం సాయంత్రం ఆరు గంటల ప్రారంభమయ్యే పోటీలు అర్ధరాత్రి వరకు కొనసాగనున్నాయి. విజేతకు దాదాపు రూ.ఎనిమిదిన్నర కోట్ల ప్రైజ్ మనీ దక్కుతుంది.
Also Read: కరోనా పేషేంట్ ని చంపేయ్.. ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఆడియో వైరల్!
ఇక ఈ కార్యక్రమానికి మిస్ వరల్డ్ 2016 స్టెఫానీ డెల్ వాలె, భారతీయ ప్రెజెంటర్ సచిన్ కుంభర్ హోస్టులుగా వ్యవహరిస్తారు. బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ ఫైనల్స్లో స్టేజ్ పైన లైవ్ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రపంచ సుందరి పోటీలకు ప్రధాన న్యాయనిర్ణేతగా సినీ నటుడు సోనూసూద్ వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా ఆయనకు మిస్ వరల్డ్ సంస్థ మానవతావాది పురస్కారాన్ని అందించనుంది. కోవిడ్ సహా వివిధ సందర్భాల్లో ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు గాను ఈ పురస్కారం దక్కనుంది. సోనూసూద్తో పాటు జ్యూరీలుగా సుధారెడ్డి, డాక్టర్ కారినా టర్రెల్ (మిస్ ఇంగ్లాండ్ 2014), మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ, మిస్ వరల్డ్ 2017, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ వ్యవహరిస్తారు.
Also Read : రాష్ట్రంలో వాటిని అణిచివేయడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు