/rtv/media/media_files/DWAwk3ZiwAJO0aMOmQD4.jpg)
Madhura Nagar Dog Incident
Madhura Nagar Dog Incident : హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పవన్ అనే వ్యక్తి మర్మంగాలను పెంపుడు కుక్క కొరికి చంపిందనే విషయంలో నిజం లేదని పోలీసులు తేల్చారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పవన్ కుమార్ (ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి) ఇంట్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఆయన ఈ ఉదయం అనుమానస్పద స్థితిలో మరణించాడు. ఆ సమయంలో ఆయనతో ఉన్న కుక్క నోటికి రక్తం ఉండటం, పవన్ ఒంటిపై రక్తం ఉండటంతో కుక్కనే పవన్ ను కొరికి చంపిందనే ప్రచారం సాగింది.
Also Read : కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!
అయితే అందరూ అనుకున్నట్లుగా పవన్ను పెంపుడు కుక్క కొరికి చంపలేదని తేలింది. అనారోగ్య సమస్యతోనే పవన్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే పవన్ మరణించే సమయంలో ఒకడే ఉండడంతో ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన పెంపుడు కుక్క పవన్ను కాపాడేందుకు విశ్వప్రయత్నం చేసినట్లు తేలింది. ఈ క్రమంలోనే పవన్ ఒంటిపై కుక్క గాట్లు అవడంతో పాటు కుక్క నోటికి రక్తపు మరకలు అంటినట్లు పోస్ట్ మార్టం నివేదికలో తేలినట్లు పోలీసులు తేల్చారు.
Also Read : దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్
వివరాల్లోకి వెళితే, మధురానగర్లో నివసించే పవన్ కుమార్ (ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అతడి స్నేహితుడు సందీప్, పవన్ను కలిసేందుకు అతడి ఇంటికి వెళ్లాడు. తలుపులు మూసి ఉండటంతో ఎంత పిలిచినా, తట్టినా లోపలి నుంచి స్పందన రాలేదు. దీంతో అనుమానం వచ్చిన సందీప్, బలవంతంగా తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించాడు. అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న పవన్ కుమార్ను చూసి షాక్కు గురయ్యాడు. గదిలోనే ఉన్న పెంపుడు కుక్క నోటికి రక్తం అంటుకుని ఉండటాన్ని సందీప్ గమనించాడు. పవన్ కుమార్ శరీరంపై గాయాలు ఉండటం, కుక్క నోటికి రక్తం ఉండటంతో.. ఆ కుక్కే పవన్పై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచి చంపి ఉంటుందని సందీప్ అనుమానం వ్యక్తం చేశాడు.
Also read : India vs Pakistan : భారత్ను రెచ్చ గొట్టడమే లక్ష్యంగా.. పాక్ మరోసారి క్షిపణి ప్రయోగం?
సందీప్ కథనం ఆధారంగా పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. పవన్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పవన్ చనిపోయే సమయంలో ఇంట్లో ఆ పెంపుడు కుక్క తప్ప మరెవరూ లేరని స్నేహితుడు సందీప్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే పవన్ మృతికి గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు.
Also Read : PM Modi: ఆర్మీ సూట్లో ప్రధాని మోదీ.. ఉగ్రవాదంపై సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్
అయితే పోస్టుమార్టం నివేదికలో పవన్ది అనారోగ్య మరణమే అని తేలటంతో పాటు ఆయన కుక్క పవన్ను కాపాడే ప్రయత్నం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో కుక్క పవన్ మర్మంగాలను కొరికి చంపిందనే ప్రచారంలో వాస్తవం లేదని తేలింది.
Also read : ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. ఒక్క కాల్ తో రూ.26 లక్షలు ఎలా కొట్టేశారంటే?