Telangana: ఓరి దుర్మార్గుల్లారా.. కాలికి గాయమైందని వెళ్తే.. ప్రాణం తీశారు కదరా!

సూర్యపేట జిల్లాకు చెందిన పరమేష్(25) తన కాలికి గాయమైందని హాస్పిటల్‌‌లో చేరాడు. ఆ తర్వాత పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు రూ.3లక్షలు కట్టించుకున్నారు. చివరికి చేతులెత్తేసి గాంధీ హాస్పిటలకు తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యలు తెలిపారు.

New Update
suryapet man died in doctors Negligence private hospital

suryapet man died in doctors Negligence private hospital

కొందరి వైద్యుల నిర్లక్ష్యం కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతున్నాయి. చిన్న చిన్న గాయాలకు పెద్ద పెద్ద సర్జరీలు చేసి.. అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కాలికి గాయం అయిందని హాస్పిటల్‌కు వెళ్లిన ఓ 25 ఏళ్ల యువకుడు.. చివరికి శవమై బయటకొచ్చాడు. ఈ విషయం తెలిసి ఆ యువకుడి తల్లి దండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటన తెలంగాణలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఇది కూడా చూడండి: ఏపీలో పదవుల జాతర.. 22 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. లిస్ట్ ఇదే!

గాయమైందని వెళ్తే

సూర్యాపేట జిల్లా ఎర్కారం గ్రామానికి చెందిన కుర్ర సైదులు కొడుకు పరమేష్ (25) రోజు వారి కూలి. అతడు హయత్‌ నగర్‌లో నివాసముంటూ రోజూ కూలి పని చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే మే 5వ తేదీన ప్యాకర్స్, మూవర్స్ ద్వారా   బహదూర్‌పల్లిలోని ఓ ఇంట్లో సామన్లు దించేందుకు వెళ్లాడు. అక్కడ అతడి కుడికాలికి గాయమైంది. పాదానికి రేకు తగిలి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో అది గమనించిన తోటి కూలీలు అతడిని సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. 

ఇది కూడా చూడండి: రాజస్థాన్ పై పాక్ డ్రోన్ దాడులు.. కలెక్టర్ కీలక ప్రకటన- LIVE VIDEO

అక్కడ వైద్యులు పరమేష్ కాలికి సర్జరీ చేశారు. అనంతరం రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తామని పరమేష్ బంధువులకు చెప్పారు. అయితే ఉన్నట్టుండి మే 9న పరిస్థితి తీవ్రమైందని.. మెదడులో రక్తస్రావమైందని వైద్యులు తెలిపారు. వెంటనే శస్త్రచికిత్స చేయకపోతే చాలా ప్రమాదమని పరమేష్ బంధువులకు చెప్పారు. ఈ ట్రీట్మెంట్ కోసం దాదాపు రూ.3 లక్షలకు పైగా అవుతుందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆ డబ్బు మొత్తాన్ని చెల్లించారు. 

ఇది కూడా చూడండి: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ?.. జెలెన్‌స్కీ సంచలన ప్రకటన

అనంతరం వైద్యులు పరమేష్‌కు ఆపరేషన్‌ చేశారు. ఆ తర్వాత మే 10న పరమేష్‌ పరిస్థితి మరింత తీవ్రతరమైందని చెప్పడంతో.. వెంటనే అతడిని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే పరమేష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అప్పుడే బాగున్నాడని చెప్పి.. అంతలోనే ఎలా చనిపోయాడని ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. వైద్యులు, యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తన సోదరుడు మృతి చెందాడని పరమేష్ అన్నయ్య మహేష్‌ దుండిగల్‌ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. హాస్పిటల్ డాక్టర్స్ అండ్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

ఇది కూడా చూడండి: వేదిక మీదే స్పృహ తప్పి పడిపోయిన హీరో విశాల్-VIDEO

crime news | latest-telugu-news | telugu-news | suryapet

Advertisment
Advertisment
తాజా కథనాలు