/rtv/media/media_files/2024/12/03/zPU1GbVhaT4n6uMc7x8X.jpg)
Telangana Paddy
Telangana : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటివనరులు పెరగటం, సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుభరోసా వంటి పథకాలతో తెలంగాణ వ్యవసాయ రంగంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు పంటలు పండక, పండిన పంటలకు గిట్టుబాటు ధర రాక వందలాది మంది తెలంగాణ రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత వ్యవసాయ రంగం ఘననీయమైన అభివృద్ధిని సాధిస్తోంది. ముఖ్యంగా వరి ఉత్పత్తిలో గడచిన 13 ఏళ్లుగా రికార్డు సృష్టి్స్తోంది. తాజాగా మరోసారి దేశవ్యప్తంగా వరి ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్వన్ స్థానంలో నిలిచింది. కేవలం వరి మాత్రమే కాకుండా అన్నిరకాల ధాన్యాల ఉత్పత్తి విలువలో నాలుగో స్థానంలో, వ్యవసాయ, అనుబంధ రంగాల స్థూలఉత్పత్తి విలువలో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. 2011--12 నుంచి 2023--24 వరకు వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పాదక విలువపై కేంద్ర గణాంకశాఖ విడుదల చేసిన నివేదిక ఈ విషాయాన్ని వెల్లడించింది.
Also Read : జపాన్లో ‘ట్విటర్ కిల్లర్’ కు ఉరి
Telangana Records In Rice Production
గడచిన 13 ఏళ్లలో వరి ఉత్పత్తిలో తెలంగాణ టాప్గా నిలుస్తోంది. వరిలో 3 రెట్ల వృద్ధిని నమోదు చేస్తూ వస్తోంది. అదే సమయంలో చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనెగింజలు, పండ్లు, కూరగాయలు, పశుసంపదలో ఇప్పటికీ వెనుకబడి ఉండటం గమనార్హం. ఇక దేశవ్యాప్తంగా అన్ని రకాల ధాన్యాల ఉత్పత్తిలో మాత్రం ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్ దేశంలో అగ్రస్థానాల్లో నిలిచాయి. కేంద్ర గణాంకశాఖ నివేదిక ప్రకారం దేశ స్థూల ఆర్థికవ్యవస్థలో వ్యవసాయ, అనుబంధ రంగాలు దాదాపు 18 శాతం వాటాను కలిగి ఉన్నాయి. వ్యవసాయం రంగం దేశానికి ఆహార భద్రత కలిపించడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తున్నాయని నివేదిక వెల్లడించింది.
Also Read : స్వేచ్ఛ తండ్రి షాకింగ్ విషయాలు.. తండ్రికి ఫోన్ చేసి ఏం చెప్పిందంటే..?
తెలంగాణలో 2023-24లో రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాల విలువ రూ.1.12 లక్షల కోట్లుగా ఉంది. ఒకప్పుడు గణనీయంగా పండిన టమోటా, ఉల్లిపాయ సాగు తగ్గంది. 2011-12 నుంచి 2023-24 వరకు దేశవ్యాప్తంగా కూరగాయలు, పండ్ల ఉత్పత్తి విలువ పెరుగుతుండగా రాష్ర్టంలో మాత్రం రూ.10,357 కోట్ల నుంచి రూ.3,933.89 కోట్లకు తగ్గింది. పత్తి, జూట్ ఇతర నార ఉత్పత్తుల్లో రాష్ట్ర వాటా 9.3 నుంచి 13 శాతానికి పెరిగింది. మసాలా దినుసుల ఉత్పత్తిలో ఏపీతో సమానంగా రెండింతల వృద్ధిని తెలంగాణ నమోదు చేసింది. గతంలో పసుపు విలువ రూ.1,132.85 కోట్లుగా ఉంటే.. ఇప్పుడది రూ.426.43కి తగ్గింది. పప్పుధాన్యాల ఉత్పత్తి, ఉత్పాదకలో తెలంగాణ వెనుకబడింది. మూడేళ్ల క్రితం వరకు రూ.1,883 కోట్లు ఉంటే.. ఇప్పుడు రూ.1,176 కోట్లకు తగ్గంది. వీటితో పాటు నూనెగింజల ఉత్పత్తి, చెరకు ఉత్పాదకత, మామిడి, ద్రాక్ష, నిమ్మ ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. అదే సమయలో మాంసం, గుడ్ల ఉత్పత్తి పెరిగింది.
Also Read : ఫౌజీ సెట్స్లో ప్రభాస్.. ఫోటో పిచ్చ క్లాస్ భయ్యా!
Also Read : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైకో NRI భర్త..సీఐ సస్పెన్సన్
telangana-agriculture | 10-years-of-telangana | Agricultural Market | agriculture | Paddy Farmers | paddy