/rtv/media/media_files/Pco8xPWYwOypFyD2tDTd.jpg)
Ponguleti
ఇందిరమ్మ ఇండ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యంత వెనుకబడిన గిరిజన తెగల్లో చెంచు వర్గం ఒకటి. వీరికి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎక్కువ ప్రాధాన్యత కల్పించనున్నట్లు ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వీరి కోసం వివిధ నియోజకవర్గాల్లో 10 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. అయితే తెలంగాణలో వీరి వర్గానికి చెందిన ప్రజలను అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇది కూడా చూడండి: AP liquor case : ఏపీ మద్యం కుంభకోణం కేసు..మిథున్ రెడ్డికి నో బెయిల్
Big News from Telangana. Housing Minister Ponguleti Srinivas Reddy reviews the Indiramma Indlu scheme, ensuring 9,395 homes for the Chenchu tribe across districts. "No government has thought about their welfare in decades," says Chief Minister @revanth_anumula. pic.twitter.com/Q8vNiIvvJp
— Revanth Anna News (@revanthannanews) May 14, 2025
ఇది కూడా చూడండి: Earth Quake: గ్రీస్ లో భారీ భూకంపం..
ఎస్టీ నియోజకవర్గాలకు ఇప్పటికే 3500 ఇళ్లు మంజూరు చేశారు. అయితే ఇప్పుడు ఈ వర్గం కోసం కోత్తగా.. 500 నుంచి 700 వరకు అదనంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ తెగలో ఉన్నవారికి ఇప్పటికీ చాలా మందికి సొంతిళ్లు లేవు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చూడండి: Ind-Pak: మోదీ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి..పాక్ విదేశాంగ శాఖ