/rtv/media/media_files/2025/05/12/4xyyphQX2c85FmjrPCgq.jpg)
PM Modi
భారత్కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని ధ్వజమెత్తారు. దీనిపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పందించింది. ప్రధాని మోదీ ప్రసంగం రెచ్చగొట్టే విధంగా ఉందని విమర్శించింది. ప్రాంతీయంగా శాంతి, సుస్థిత్వం కోసం కృషి జరుగుతోంది...కానీ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు అందుకు విరుద్ధంగా ఉద్రిక్తతలను పెంచేవిగా ఉన్నాయి అంది. కాల్పులు విరమణ తామే కోరామని చెప్పడంలో నిజం లేదని..భారత్ చర్యలు ఈ ప్రాంతం మొత్తాన్ని ప్రమాదం అంచుల్లో పడేసేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది.
పాక్ బెంబేలెత్తిపోయింది..
మరోవైపు ఆపరేషన్ సిందూర్తో పాక్కు ఒక కొత్త తరహాలో జవాబు చెప్పామన్నారు ప్రధాని మోదీ. ఉగ్రవాదులు దాడి చేస్తే ఇకనుంచి ఇదే తరహాలో స్పందిస్తాని తేల్చిచెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ పాక్ తోకజాడిస్తే అంతం చేస్తామని హెచ్చరించారు. భారత్కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోంది. ఒకే ఒక్క దాడితో పాకిస్థాన్ బెంబెలెత్తిపోయింది.పాకిస్థాన్ మిసైల్స్ మన రక్షణ వ్యవస్థ ముందు తేలిపోయాయి. ఉగ్రవాదులను అంతం చేయాల్సిన పాకిస్థాన్ మనపై ఎదురుదాడులు చేసింది. పాఠశాలలు, ఆస్పత్రులు, గురుద్వార్లను లక్ష్యంగా చేసుకుంది. కానీ మనం పాక్ గుండెల్లో బాంబు పేల్చాం అంటూ చెప్పుకొచ్చారు.
today-latest-news-in-telugu | pm modi | pakistan | speech