/rtv/media/media_files/2025/05/14/hywAyffRantZAUgJ6JQ3.jpg)
MP Mithun Reddy
AP liquor case : ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించింది. ముందస్తు బెయిల్ కావాలని కోరిన ఆయనకు హైకోర్టునే ఆశ్రయించాలని సుప్రీం సూచించింది. అంతేకాక గతంలో మిథున్ రెడ్డికి కల్పించిన మధ్యంతర రక్షణను కూడా కోర్టు రద్దు చేసింది.ఆయన పిటిషన్ పై విచారణను ముగిస్తున్నట్లు స్పష్టం చేసింది.
Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్ కూడా మేమే
మద్యం కుంభకోణంలో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై మంగళవారం జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారించింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విలు తమ వాదనలు వినిపించారు. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసిన సమయానికి కేసులో ఆయనను నిందితుడిగా చేర్చలేదని, ఆయనను అరెస్ట్ చేసే అవకాశం లేదని ఏపీ ప్రభుత్వం తెలిపిన విషయాన్ని న్యాయస్థానం వెల్లడించింది. అయితే ప్రస్తుతం మిథున్రెడ్డిని కూడా నిందితునిగా చేర్చినట్లు ప్రభుత్వం తరుపు న్యాయవాది వివరించారు.
Also Read: అలాంటి పదవులేవి నాకొద్దు.. CJI సంజీవ్ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు
అయితే ఇదే విషయమై గతంలో హైకోర్టులో పిటిషన్ వేశామని, ఆ సమయంలో మిథున్ రెడ్డిని నిందితునిగా చేర్చనపుడు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ ఎందుకు వేసినట్లని హైకోర్టు ప్రశ్నించిందని సింఘ్వీ గుర్తు చేశారు. ప్రస్తుతం నిందితునిగా చేర్చినందున బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే ఈ విషయమై మరోసారి హైకోర్టునే ఆశ్రయించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది, ఈ కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి బాధ్యత గల పార్లమెంట్ సభ్యుడు అని, ఆయన విచారణకు అన్ని విధాల సహకరిస్తున్నారని న్యాయవాది వివరించారు. హైకోర్టు తీర్పు ఇచ్చే వరకు ఆయనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని మిథున్ రెడ్డి తరుపు న్యాయవాది కోరారు.
Also Read: ఇదేం ట్విస్ట్ మామా.. 7వ అడుగు వేస్తుండగా పెళ్లి రద్దు చేసుకున్న యువకుడు!
ఇప్పటికే ఆయన దర్యాప్తు అధికారి ఎదుట విచారణకు హాజరయ్యారని వివరించారు. అయితే ఈ కుంభకోణంలో మిథున్ రెడ్డిని తాజాగా నిందితునిగా చేర్చినందున వెంటనే అరెస్ట్ చేయడం సరికాదని, విచారణకు సహకరిస్తే అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదని సుప్రీం అభిప్రాయపడింది. హైకోర్టు నిర్ణయం వెలువరించేవరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయబోమని ఏపీ ప్రభుత్వం తరుపున న్యాయవాది ముకుల్ రోహిత్గీ స్పష్టం చేశారు. కాగా నాలుగువారాల్లోగా మిథున్ రెడ్డి పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని సుప్రీం సూచించింది. అలాగే కేసును దర్యాప్తు చేస్తున్న సంస్థ సమర్పించిన నివేదికలను హైకోర్టు ఆధారంగా తీసుకోవాలని, రాష్ర్ట ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం సూచించింది.
Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?