/rtv/media/media_files/2025/11/19/kavitha-arrest-2025-11-19-16-26-07.jpg)
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు(Telangana Jagruthi Leader) కవితని పోలీసులు అరెస్ట్(Kavitha Arrest) చేశారు. ఆమె జాగృతి నేతలతో కలిసి హైదరాబాద్ లక్డీకపూల్లోని సింగరేణి భవన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు కవితతోపాటు పలువురు జాగృతి నేతల్ని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.
Also Read : BREAKING: ఐబొమ్మ రవికి మరో బిగ్ షాక్..
Kavitha Arrest
సింగరేణి మెడికల్ బోర్డు వెంటనే నిర్వహించి కార్మికులకు న్యాయం చేయాలని అలియాస్ కార్మికులకి అవకాశం ఇవ్వాలని సొంతంటి పథకం కచ్చితంగా అమలు చేయాలని ఐటీ నిహాయింపు ఇవ్వాలని కార్మికుల కోసం హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఈరోజు సింగరేణి భవన్ ముట్టడి చేయడం… pic.twitter.com/xxD4P7sHxY
— Venkat jagruthi (@Venkatjagruthi6) November 19, 2025
Also Read : ఢిల్లీ ఆత్మాహుతి దాడిపై.. MP అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని, మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ సింగరేణి భవన్ ముట్టడికి పిలుపునిచారు కవిత. ఈ క్రమంలో సింగరేణి భవన్ ముట్టడిలో పాల్గొన్న కవిత రోడ్డుపై బైఠాయించారు . సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు.
Follow Us