/rtv/media/media_files/2025/01/13/9pJUXeAU4onsooQfE1At.jpg)
Telangana Inter Supplementary Results
BIG BREAKING : తెలంగాణ ఇంటర్ మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ రోజు ఇంటర్మీడియట్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. బోర్డు తెలిపిన సమాచారం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
Also Read: దుబాయ్లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం
కాగా విడుదలైన ఇంటర్ ఫలితాలను... ఇంటర్ బోర్డు అధికారిక సైట్ లో చెక్ చేసుకునే అవకాశం కల్పించారు. వీటితో పాటు వివిధ మీడియా సంస్థలు, ఇతర ప్రైవేట్ వెబ్ సైట్లు కూడా ఇంటర్ ఫలితాలను తమ తమ సైట్లలో పొందుపరచనున్నాయి. కాగా ఇంటర్లో తప్పిన విద్యార్థుల కోసం గత నెల 2వ తేదీ నుంచి... 29వ తేదీ వరకు తెలంగాణ ఇంటర్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించింది.. ఈ పరీక్షలకు 4.13 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
Also Read: ఎంత మూర్కుడివిరా నీవు....భార్యను బాల్కనీ రెయిలింగ్కు వేలాడదీసిన భర్త
విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు గాను బోర్డు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ పరీక్షల్లో పాస్ అయితే ఉన్నత చదువులకు అవకాశం ఉంటుంది. ఈఏపీసెట్, నీట్ లాంటి ప్రవేశాలకు ఇంటర్ మార్కులు చాలా కీలకం. కాగా ఇప్పుడు పాస్ అవుతే ఈ ఏడాది నష్టపోకుండా చదువును కొనసాగించవచ్చు.ఈ ఫలితాలలో మరోసారి ఫెయిల్ అయితే మాత్రం వచ్చే ఏడాది వరకు ఆగాల్సి ఉంటుంది. అంటే ఒక ఏడాది విద్యాసంవత్సరం నష్టపోయినట్లే.