CM Revanth: రాష్ట్రంలో మూడు అనుమానాస్పద హత్యలు.. కేటీఆర్ పై బాంబ్ పేల్చిన సీఎం రేవంత్!
నిర్మాత కేదర్ హత్య వెనుక డ్రగ్స్ మాఫియా ఉందని సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. కేదార్, కాళేశ్వరం కేసుల న్యాయవాది సంజీవ్ రెడ్డి, కేసు వేసిన లింగ మూర్తి హత్యలపై అనుమనాలు వ్యక్తం చేశారు. ఈ కేసులపై విచారణకు KTR ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో మూడు అనుమానాస్పద మరణాలు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాత కేదార్, కాళేశ్వరం కేసులు వాదిస్తున్న న్యాయవాది సంజీవ్ రెడ్డి, కేసు వేసిన లింగ మూర్తి మరణాలపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీలో ఈ రోజు సీఎం చిట్ చాట్ చేశారు. కేదర్ మరణం వెనుక పెద్ద మిస్టరీ ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసు లో ఉన్న వాళ్ళు వరసగా చనిపోతున్నారన్నారు. కేదర్ హత్యపై ప్రభుత్వానికి ఫిర్యాదు వస్తే విచారణ చేస్తామన్నారు. కేదార్ మృతదేహం త్వరలోనే ఇండియాకు రానుందన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే దుబాయ్ లోనే ఉన్నారని.. ఆ ఎమ్మెల్యే ఎవరు? అన్న అనుమానాలను వ్యక్తం చేశారు. త్వరలోనే డ్రగ్స్ కేసు విచారణకు రాబోతోందన్నారు. కేదర్ కేటీఆర్ (KTR) వ్యాపార భాగస్వామి అని అన్నారు. కేదర్ చనిపోతే కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
కమిషన్లు రావనే ఎస్ఎల్బీసీ పనులను కేసీఆర్ (KCR) పక్కన పెట్టారన్నారు. కాళేశ్వరం నిపుణుల కమిటీ నివేదికల ఆధారంగానే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఉపఎన్నికలు ఎలా వస్తాయో అర్థం కావడం లేదన్నారు. 2014 నుంచి 2024 వరకు ఉన్న శాసన వ్యవస్థే ఇప్పుడు ఉందన్నారు. రాష్ట్రంలో అసలు బీఆర్ఎస్ ఎక్కడుంది? అని ప్రశ్నించారు. అధ్యక్షుడు ఎవరైనా బీజేపీ తోనే తమకు పోటీ అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ గెలుపు కోసం పనిచేస్తోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో విదేశాలలో ఉన్న వారిని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
కేంద్ర మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. విదేశాల్లో ఉన్న వాళ్లను ఎవరు తీసుకొస్తారో తెలియకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మెట్రో ను కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకురాకుండా అడ్డుకున్నదే కిషన్ రెడ్డి అని ఆరోపించారు. తాను ప్రధానికి ఇచ్చిన ఐదు విజ్ఞప్తులను సాధించుకొని తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి , బండి సంజయ్ దేనని స్పష్టం చేశారు. అవన్నీ తీసుకొచ్చి క్రెడిట్ వాళ్ల సొంతం చేసుకోవచ్చన్నారు. బహిరంగ సభ ఏర్పాటు చేసి వారికి సన్మానం కూడా చేస్తానని ఆఫర్ ఇచ్చారు.
హైదరాబాద్ కు మెట్రో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, అప్పటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు మానిటర్ చేస్తోందన్నారు. సీబీఐ కేసులు అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉందన్నారు. ఫార్ములా ఈ, గొర్రెల పంపిణీ కేసుల్లో ఈడీ ఇన్వాల్వ్ అయ్యిందన్నారు. మరి ఈడీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.రాత్రికి రాత్రి తాము ఎవ్వరినీ అరెస్ట్ చేయమని.. అది తమ విధానం కాదన్నారు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్ల పై కమిషన్ విచారణ జరుగుతుందన్నారు.
ఎన్ని అవంతరాలు ఎదురైనా ఎస్ఎల్బీసీని 100% పూర్తిచేసి తీరుతామని స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీ పెరిగిన అంచనాలతో కలిపి 5000 కోట్ల లోపే పూర్తయ్యే ప్రాజెక్టు అని అన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయన్నారు. ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ లో 11 సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. తన కేబినెట్లోని మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఉందని.. అందరూ అనుభవజ్ఞులేనన్నారు. వారి శాఖలో వారంతా సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు. తన పాలన అద్భుతంగా ఉందన్నారు. ఎవరి ఫోన్లో వాళ్ళు ధైర్యంగా మాట్లాడుకునే స్వేచ్ఛ కల్పిస్తున్నానన్నారు. కేంద్రానికి పన్నులు ఎంత కడుతున్నామో అంతే స్థాయిలో రాష్ట్రాలకు వాటా రావాలని డిమాండ్ చేశారు.
CM Revanth: రాష్ట్రంలో మూడు అనుమానాస్పద హత్యలు.. కేటీఆర్ పై బాంబ్ పేల్చిన సీఎం రేవంత్!
నిర్మాత కేదర్ హత్య వెనుక డ్రగ్స్ మాఫియా ఉందని సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. కేదార్, కాళేశ్వరం కేసుల న్యాయవాది సంజీవ్ రెడ్డి, కేసు వేసిన లింగ మూర్తి హత్యలపై అనుమనాలు వ్యక్తం చేశారు. ఈ కేసులపై విచారణకు KTR ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు.
CM Revanth Reddy
రాష్ట్రంలో మూడు అనుమానాస్పద మరణాలు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాత కేదార్, కాళేశ్వరం కేసులు వాదిస్తున్న న్యాయవాది సంజీవ్ రెడ్డి, కేసు వేసిన లింగ మూర్తి మరణాలపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీలో ఈ రోజు సీఎం చిట్ చాట్ చేశారు. కేదర్ మరణం వెనుక పెద్ద మిస్టరీ ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసు లో ఉన్న వాళ్ళు వరసగా చనిపోతున్నారన్నారు. కేదర్ హత్యపై ప్రభుత్వానికి ఫిర్యాదు వస్తే విచారణ చేస్తామన్నారు. కేదార్ మృతదేహం త్వరలోనే ఇండియాకు రానుందన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే దుబాయ్ లోనే ఉన్నారని.. ఆ ఎమ్మెల్యే ఎవరు? అన్న అనుమానాలను వ్యక్తం చేశారు. త్వరలోనే డ్రగ్స్ కేసు విచారణకు రాబోతోందన్నారు. కేదర్ కేటీఆర్ (KTR) వ్యాపార భాగస్వామి అని అన్నారు. కేదర్ చనిపోతే కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
Also Read : పిల్లలు ఈ 5 చెడు అలవాట్లను చాలా వేగంగా నేర్చుకుంటారు
కమిషన్లు రావనే ఎస్ఎల్బీసీపై నిర్లక్ష్యం..
కమిషన్లు రావనే ఎస్ఎల్బీసీ పనులను కేసీఆర్ (KCR) పక్కన పెట్టారన్నారు. కాళేశ్వరం నిపుణుల కమిటీ నివేదికల ఆధారంగానే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఉపఎన్నికలు ఎలా వస్తాయో అర్థం కావడం లేదన్నారు. 2014 నుంచి 2024 వరకు ఉన్న శాసన వ్యవస్థే ఇప్పుడు ఉందన్నారు. రాష్ట్రంలో అసలు బీఆర్ఎస్ ఎక్కడుంది? అని ప్రశ్నించారు. అధ్యక్షుడు ఎవరైనా బీజేపీ తోనే తమకు పోటీ అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ గెలుపు కోసం పనిచేస్తోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో విదేశాలలో ఉన్న వారిని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
Also Read : తమిళంలో మాట్లాడలేకపోతున్నా: అమిత్ షా
కేంద్ర మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. విదేశాల్లో ఉన్న వాళ్లను ఎవరు తీసుకొస్తారో తెలియకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మెట్రో ను కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకురాకుండా అడ్డుకున్నదే కిషన్ రెడ్డి అని ఆరోపించారు. తాను ప్రధానికి ఇచ్చిన ఐదు విజ్ఞప్తులను సాధించుకొని తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి , బండి సంజయ్ దేనని స్పష్టం చేశారు. అవన్నీ తీసుకొచ్చి క్రెడిట్ వాళ్ల సొంతం చేసుకోవచ్చన్నారు. బహిరంగ సభ ఏర్పాటు చేసి వారికి సన్మానం కూడా చేస్తానని ఆఫర్ ఇచ్చారు.
హైదరాబాద్ కు మెట్రో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, అప్పటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు మానిటర్ చేస్తోందన్నారు. సీబీఐ కేసులు అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉందన్నారు. ఫార్ములా ఈ, గొర్రెల పంపిణీ కేసుల్లో ఈడీ ఇన్వాల్వ్ అయ్యిందన్నారు. మరి ఈడీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.రాత్రికి రాత్రి తాము ఎవ్వరినీ అరెస్ట్ చేయమని.. అది తమ విధానం కాదన్నారు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్ల పై కమిషన్ విచారణ జరుగుతుందన్నారు.
Also Read : ఐసీసీ ర్యాంకింగ్స్ టాప్5లో విరాట్ కోహ్లీ.. ఫస్ట్ ప్లేస్ ఎవరంటే?
ఎన్ని అవంతరాలు ఎదురైనా ఎస్ఎల్బీసీని 100% పూర్తిచేసి తీరుతామని స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీ పెరిగిన అంచనాలతో కలిపి 5000 కోట్ల లోపే పూర్తయ్యే ప్రాజెక్టు అని అన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయన్నారు. ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ లో 11 సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. తన కేబినెట్లోని మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఉందని.. అందరూ అనుభవజ్ఞులేనన్నారు. వారి శాఖలో వారంతా సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు. తన పాలన అద్భుతంగా ఉందన్నారు. ఎవరి ఫోన్లో వాళ్ళు ధైర్యంగా మాట్లాడుకునే స్వేచ్ఛ కల్పిస్తున్నానన్నారు. కేంద్రానికి పన్నులు ఎంత కడుతున్నామో అంతే స్థాయిలో రాష్ట్రాలకు వాటా రావాలని డిమాండ్ చేశారు.
Also Read : ఇక మనుషుల అవసరం ఉండదేమో!.. సీక్రెట్ భాషలో మాట్లాడుకుంటున్న రెండు ఏఐ అసిస్టెంట్స్