SLBC Tunnel Collapse : ముగిసిన రెస్క్యూ ఆపరేషన్.. లభించని ఆరుగురు కార్మికుల ఆచూకీ. డేంజర్ జోన్ లో...
గడచిన 58 రోజులుగా శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ఈ ప్రమాదంలో మొత్తం 8 మంది కార్మికులు గల్లంతవ్వగా ఇద్దరి మృత దేహాలను రెస్క్యూ బృందాలు వెలికి తీశాయి. కానీ మరో ఆరుగురు కార్మికుల ఆచూకీ లభించలేదు.