BIG BREAKING: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన లారీ!

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయ్యారు.. మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సత్తుపల్లి ఆస్పత్రికి తరలించారు.

New Update
khammam crime news

khammam crime news

Khammam Crime News: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం పరిధిలోని కిష్టారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓసి2 సమీపంలో తల్లాడ, దేవరపల్లి జాతీయ రహదారిపై హైదరాబాద్ నుండి రాజమండ్రికి వెళ్లుతుండగా ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సును ఖమ్మం వైపు వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదం తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. బస్సులోని డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతను బస్సు క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన పరిస్థితి తలెత్తింది. సమాచారం అందుకున్న వెంటనే వాహనదారులు, సమీపంలో ఉన్న ఇతర డ్రైవర్లు కలిసి సుమారు అరగంటపాటు శ్రమించి అతన్ని బయటకు తీశారు. గాయపడిన డ్రైవర్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Also Read :  ఆపరేషన్‌ సిందూర్‌ : పాక్ ఆర్మీని టీ20 వరల్డ్‌కప్‌ వీడియోతో పోల్చిన బీజేపీ

పరారీలో లారీ డ్రైవర్

ఈ ప్రమాదంలో మరో ఇద్దరు ప్రయాణికులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు స్పందించి వెంటనే వారిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణాపాయం లేకుండా అందరూ తప్పించుకున్నారు. అయితే ప్రమాద లారీ బస్సును అత్యంత వేగంగా ఢీకొట్టిందని   కొందరూ చెబుతున్నారు. ఈ ఘటన తల్లాడ నుండి దేవరపల్లి వరకు వెళ్లే జాతీయ రహదారిపై చోటుచేసుకోవడంతో రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. 

ఇది కూడా చదవండి: ఆరోగ్యానికి మేలి చెసే ఏనుగు నడక వ్యాయామం

ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సంఘటన అనంతరం లారీ డ్రైవర్ అక్కడే లారీని వదిలేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బస్సు, లారీని తరలించి ట్రాఫిక్‌ను మళ్లీ సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రయాణికులు రహదారులపై మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డ్రైవింగ్ సమయంలో వేగానికి నియంత్రణ ఉండాలని, రహదారి నియమాలను పాటించాలని సూచిస్తున్నారు.

( ts-crime | ts-crime-news | latest-news | telugu-news | crime)

ఇది కూడా చదవండి:  ఆహారంపై నిమ్మరసం ఎందుకు వెసుకుంటారో తెలుసా..? ఆరోగ్య రహస్యం ఇదే

Also Read :  ఇజ్జత్ పోయిందిపో... సొంత దేశంలోనే పాకిస్తాన్‌కు ఘోర అవమానం

Advertisment
Advertisment
తాజా కథనాలు