/rtv/media/media_files/2025/01/26/aOxI93ADcBIIlfy3EL2r.jpg)
Telangana CM Revanth key decision on sand supply to Indiramma houses
TG News: ఇందిరమ్మ ఇళ్లకు(Indiramma houses) ఇసుక సరఫరాపై అధ్యయనం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా గనుల శాఖపై రాష్ట్ర సచివాలయంలో(Sachivalayam) మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించిన అధ్యయన కమిటీని నియమించారు. కమిటీ సభ్యులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు(Ramakrishna rao), గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక, టీజీ ఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కుమార్ను ఎంచుకున్నారు. ఈ కమిటీ వారంలోపు తమ అధ్యయనాన్ని పూర్తిచేసి సమగ్ర విధివిధానాలతో నివేదిక సమర్పించాలని సూచించారు.
ప్రభుత్వానికి ఆదాయం లేదు..
రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు ఇసుక ఏవిధంగా సరఫరా చేయాలనే దానిపై సమగ్రంగా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఏటేటా నిర్మాణాలు పెరుగుతున్నా ఇసుక నుంచి ప్రభుత్వానికి ఆదాయం ఆశించినంత రావడం లేదన్నారు. వినియోగదారులు ఎక్కువ ధరకే ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తోందని, వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక దక్కేలా చూడాలన్నారు.
ఇది కూడా చదవండి: Gurumurthy: 8గంటలు 16 వస్తువులు.. మీర్పేట్ మాధవి మర్డర్ కేసులో కీలక అప్ డేట్!
అలాగే ఇసుక మాఫియాను అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. మేజర్, మైనర్ ఖనిజాల గనులకు వేసిన జరిమానాలు వసూళ్లు కాకపోవడంపైనా అధికారులను ఆరాతీశారు. మేజర్, మైనర్ ఖనిజ విధానంపై సమగ్రంగా అధ్యయనం చేసి రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని అధ్యయన కమిటీని ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Pongulate Srinivas Reddy), ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంత కుమారి, వి.శేషాద్రి, మాణిక్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Johny master : జానీ మాస్టర్ పై కేసు.. తొలిసారి నోరు విప్పిన కొరియోగ్రాఫర్.. సంచలన ఇంటర్వ్యూ!