Mauni Amavasya: మౌని అమావాస్య రోజు గంగలో మునిగితే పాపాలు పోతాయా? మహాకుంభమేళకు పోటెత్తుతున్న భక్తులు

జనవరి 29 మౌని అమావాస్య రోజున ప్రయాగ్ రాజ్ కుంభమేళలో మూడో అమృత స్నానం జరగనుంది. ఈ నేపథ్యంలో భక్తులు మహాకుంభమేళకు పోటెత్తుతున్నారు. మౌని అమావాస్య రోజున దాదాపు 10 కోట్ల మంది భక్తులు సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

New Update
 Maha Kumbh mela

Maha Kumbh mela

Mauni Amavasya:  జనవరి 29 మౌని అమావాస్య రోజున ప్రయాగ్ రాజ్ కుంభమేళలో మూడో అమృత స్నానం జరగనుంది. ఈ నేపథ్యంలో మౌని అమావాస్య రోజున త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు మహాకుంభమేళకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశ, విదేశాల నుంచి ప్రజలు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు. దీంతో నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్టాప్‌లు, హైవేలు యాత్రికులతో నిండిపోయాయి. అయితే మౌని అమావాస్య రోజున దాదాపు 10 కోట్ల మంది భక్తులు సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించే అవకాశం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే శుక్ర, శని వారాల్లో 1.25 కోట్ల మందికి పైగా భక్తులు  త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించినట్లు   అధికారులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: Johny master : జానీ మాస్టర్ పై కేసు.. తొలిసారి నోరు విప్పిన కొరియోగ్రాఫర్.. సంచలన ఇంటర్వ్యూ!

మౌని అమావాస్య ప్రాముఖ్యత 

మాఘమాసంలో వచ్చే కృష్ణ పక్ష అమావాస్యను మౌని అమావాస్య అంటారు. అయితే ఈ ఏడాది మౌని అమావాస్యకు మరింత ప్రత్యేకత ఉంది. మౌని అమావాస్య నాడు సూర్యుడు, చంద్రుడు, బుధుడు మూడు గ్రహాలు మకర రాశిలో కలిసి వస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించడం ద్వారా పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు. ఇంట్లో కూడా ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. 

భారీగా ఏర్పాట్లు.. 

మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. మహాకుంభ సమయంలో భద్రత చర్యలను కొనసాగించడానికి జాతర ప్రాంతాన్ని వాహన రహిత జోన్‌గా ప్రకటించారు. అలాగే భక్తుల రాకపోకలకు వీలుగా అన్ని సెక్టార్లు, మండలాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల సన్మార్గంలో చేరుకునేందుకు  మహాకుంభం ప్రాంతంలో రెండు వేలకు పైగా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రజల సౌకర్యానికి ప్రాధాన్యతనిస్తూ  'అమృత స్నానం' సమయంలో ప్రత్యేక ప్రోటోకాల్స్ ఏవీ కూడా అమలు చేయబోమని  అధికారులు తెలిపారు. 

 Also Read: Balakrishna: పద్మభూషణ్ అవార్డు స్పందించిన బాలయ్య.. అభిమానుల గురించి చెబుతూ భావోద్వేగం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు