BJP: జూబ్లీహిల్స్ లో బీజేపీదే గెలుపు.. ఆ పార్టీ చీఫ్ రామచందర్‌రావు చెప్పిన లాజిక్ ఇదే!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం ఖాయమని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. గత జీహెచ్ఎంసీ ఫలితాలు రిపీట్ కాబోతున్నాయన్నారు. నియోజకవర్గంలో సమీకరణాలు మారాయన్నారు.

New Update
BJP Ram Chander Rao

BJP Ram Chander Rao

Ram Chander Rao Over Jubilee Hills By Election

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ విజయం ఖాయమని ఆ పార్టీ తెలంగాణ చీఫ్‌ రామచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఇక్కడ సమీకరణాలు మారతాయన్నారు. ఈ రోజు మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ ఓటర్లు బీజేపీ వైపు తిరిగారన్నారు. మరలా ఎమ్మెల్యే ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు వెళ్లారన్నారు. ఇప్పుడు మళ్లీ మారారన్నారు. నియోజకవర్గంలోని ఎంఐఎం ఓటర్లు ఈ సారి ఎటు పోతారో చూడాల్సి ఉందన్నారు. వారు కాంగ్రెస్ వైపా? బీఆర్ఎస్ వైపా? అన్నది చూడాలన్నారు. ముఖ్య నేతలతో చర్చించి రాష్ట్ర కమిటీ నియామకం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం దక్కేలా రాష్ట్ర కమిటీ ఉంటుందన్నారు. పార్టీలో అందరం కలిసి కట్టుగా ఉన్నామని.. ఎలాంటి వర్గాలు లేవన్నారు. 

Also Read :  అయ్యో బిడ్డా.. తెలంగాణలో ప్రాణం తీసిన ఫ్యాన్.. 9 ఏళ్ల చిన్నారి మృతి

Also Read :  ప్రేమికుల సూసైడ్...పెద్దలు ఒప్పుకోలేదని బ్లేడ్ తో కోసుకుని..

Also Read :  'అందులో తప్పేముంది'.. సీఎం పదవిపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

Also Read :  మంత్రి ఆనం Vs నారాయణ.. పేలిన మాటల తూటాలు

telugu breaking news | telugu-news | Latest News | telangana-bjp

Advertisment
Advertisment
తాజా కథనాలు