Telangana: అయ్యో బిడ్డా.. తెలంగాణలో ప్రాణం తీసిన ఫ్యాన్.. 9 ఏళ్ల చిన్నారి మృతి

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం చిట్కుల్‌లో విషాదం చోటుచేసుకుంది. 9 ఏళ్ల చిన్నారి సహస్ర ప్రాణాలు కోల్పోయింది. కరెంట్ లేని సమయంలో ఫ్యాన్‌కు టవల్ చుట్టి ఆడుకుంది. కరెంట్ రావడంతో ఆ టవల్ మెడకు చుట్టుకుపోయి ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

New Update
Sangareddy 9 year old girl died (1)

Sangareddy 9 year old girl died (1)

తెలంగాణలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం చిట్కుల్‌లో 9 ఏళ్ల చిన్నారి సహస్ర ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదవశాత్తు మెడకు టవల్ చుట్టుకొని బాలిక సహస్ర మృతి చెందింది.

Also Read :  నాకు గొర్రెలు, బర్రెల శాఖలిస్తే ఏం చేసుకోవాలి.. మంత్రి వాకిటి సంచలన కామెంట్స్!

Also Read :  పాక్ గూఢచారి జ్యోతికి రాచమర్యాదలు...ఏకంగా ఆ రాష్ట్ర అతిథిగా....కేరళ శారీలో..

చిన్నారి మృతి

కరెంట్ లేని సమయంలో చిన్నారి సహస్ర ఫ్యాన్‌కు టవల్ చుట్టి ఆడుకుంది. అదే సమయంలో కరెంట్ రావడంతో స్విచ్ ఆన్‌లో ఉండటంతో ఆ టవల్ ఆమె మెడకు చుట్టుకుంది. దీంతో చిన్నారి సహస్ర ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. బాలిక మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అనంతరం బాలిక మృతదేహాన్ని పటాన్ చెరు ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.

Also Read :  క్యాన్సర్‌ విషయం చెప్తాడని అనుకోలేదు.. ఆకాశ్‌దీప్ సోదరి ఎమోషనల్

Also Read :  Aghori - Sri Varshini: అఘోరీకి వెన్నుపోటు పొడిచిన శ్రీవర్షిణి.. న్యూ లుక్ చూశారా?

telangana | Telangana Crime | sangareddy | sangareddy crime

Advertisment
Advertisment
తాజా కథనాలు