/rtv/media/media_files/2025/06/26/congress-disciplinary-committee-2025-06-26-21-00-24.jpg)
Congress Disciplinary Committee
Hyderabad: రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీలో విభేధాలు తారాస్థాయికి చేరుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నేతల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో వారిపై తీసుకునే చర్యలపై చర్చించేందుకు పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పలువురిపై చర్యలకు సిద్ధమైంది. నేతల మధ్య రోజురోజుకు పెరుగుతున్న గొడవలతో పార్టీ పరువు పోతుందని భావిస్తున్న అధిష్టానం గొడవలకు కారణమవుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. దీనికోసం ముందుగా క్రమశిక్షణ కమిటీలో చర్చించాలని నిర్ణయించింది. ఈ రోజు మొదటిసారి సమావేశమైన కమిటీ వచ్చిన ఫిర్యాదులపై సుదీర్ఘంగా చర్చించింది. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ సమస్యలను పరిష్కరించేందుకు అనుసరించాల్సిన విధివిధానాలను ఖరారు చేసినట్లు తెలిసింది.
Also Read: సైబర్ నేరాలపై సీబీఐ ఉక్కుపాదం.. 700 బ్యాంకుల్లో 8.5 లక్షల మ్యూల్ ఖాతాల గుర్తింపు
ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఫిర్యాదులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వాటిపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై నిర్ణయం తీసుకునేందుకు శనివారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ర్ట వ్యాప్తంగా పలువురు నేతలు ఒకరిపై ఒకరు కమిటీకి ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా వరంగల్ జిల్లా నేతలు ఆ పార్టీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీపై ఫిర్యాదు చేశారు. మురళీ ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. దీనిపై సమావేశమైన ఆ జిల్లా ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వెంటనే మంత్రి కొండా సురేఖ సైతం కడియం శ్రీహరిని ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. దీంతో వారంతా క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. ఒక దశలో కొండా దంపతులు కావాలా మేము కావాలో తేల్చుకోమని అల్టిమేటం జారీ చేశారు.
Also Read: టోల్ ట్యాక్స్ కట్టాలని అడిగినందుకు.. తుపాకీతో కాల్పులు
ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ కార్పొరేటర్ విజయారెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇప్పటికే ఇద్ధరి మధ్య పలుమార్లు విభేదాలు బయటపడ్డాయి. అటు పఠాన్చెరు కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి ల మధ్య కూడా విభేదాలు తారాస్థాయికి చేరాయి.అయితే ఈ గొడవ కమిటీ ముందుకు రానట్టు తెలిసింది. ఇక అసిఫాబాద్ జిల్లాలో రాగి శ్రీనివాస్పై ఫిర్యాదు వచ్చిందని దానిపై చర్చించామని తెలిపారు. దీనికి తోడు ఇటీవల గాంధీభవన్లో జరిగిన గొడవల పై కూడ చర్చించినట్లు తెలిసింది.
ఇది కూడా చూడండి: Vivo T4 Ultra Offers: వివో మామ ఇచ్చిపడేశాడు భయ్యా.. T4 Ultra మొబైల్పై భారీ డిస్కౌంట్లు - కెమెరా హైలైట్!