Jagadish Reddy : మీడియా ముసుగులో  స్లాటర్‌ హౌజ్ లు... మేము దాడి చేస్తే తట్టుకోలేరు: మాజీమంత్రి జగదీశ్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కొంతమంది మీడియా ముసుగులో స్లాటర్‌ హౌజ్‌లు నడుపుతున్నారని, ఎవడ్ని చూసుకొని మీకు ఈ బలుపు. దాడి చేయలేరు అనుకోకండి.. మా సహనాన్ని పరీక్షించకండి. అంటూ మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్వర్‌ రెడ్ది మీడియా మీద ఫైర్‌ అయ్యారు.

New Update
Guntakandla Jagadish Reddy

Guntakandla Jagadish Reddy

కొంతమంది మీడియా ముసుగులో స్లాటర్‌ హౌజ్‌లు నడుపుతున్నారని, . ఎవడ్ని చూసుకొని మీకు ఈ బలుపు. దాడి చేయలేరు అనుకోకండి.. మా సహనాన్ని పరీక్షించకండి. అంటూ మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్వర్‌ రెడ్ది మీడియా మీద ఫైర్‌ అయ్యారు. మీడియాలో కేసీఆర్, కేటీఆర్ వ్యక్తిత్వాలను హననం చేసే దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. మీడియా ముసుగులో దాడి చేస్తామంటే కేసీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. మీ దాడులకు మేము ప్రతి దాడులు చేస్తే తట్టుకోలేరన్నారు. సూర్యాటపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మీడియా ముసుగులో ప్రభుత్వం కేసీఆర్, కేటీఆర్‌లపై అసత్య ప్రచారాలు చేస్తున్నదని కాంగ్రెస్ పై మండిపడ్డారు. 

Also Read: నా కొడుకు వీర్యాన్ని అప్పగించండి.. కోర్టులో తల్లి వింత పిటిషన్

Jagadish Reddy's Sensational Comments

ఏడాదిన్నరగా మీడియాని అడ్డం పెట్టుకుని కేసీఆర్‌పై కుట్రలు చేస్తూన్నరని చెప్పారు. తమను ఇబ్బందిపెట్టే వారిని ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని, చంద్రబాబు , రేవంత్‌ను చూసి మురుస్తున్న వారిని భవిష్యత్తులో ఎవ్వరూ కాపాడలేరని స్పష్టం చేశారు. పథకం ప్రకారమే బీఆర్ఎస్‌పై దుర్మార్గానికి పాల్పడుతున్నారని చెప్పారు. మీడియా కేంద్రాల ముసుగులో కబేళాలు (స్లాటర్ హౌస్‌లు) నడుపుతున్నారని మండిపడ్డారు. తెలంగాణాను ఆంధ్ర నుంచి విడదీశారనే అక్కసుతోనే కేసీఆర్‌పై కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. తమ పిటిషన్లపై ప్రేక్షక పాత్రపోషించే పోలీసులు.. తమపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు.

Also Read: Ee Nagaraniki Emaindi: "ఈ నగరానికి ఏమైంది" ఫ్యాన్స్ కి పండగే.. సీక్వెల్ పోస్టర్ అదిరింది!

‘రాజకీయ పార్టీలుగా మేమూ మేమూ తేల్చుకుంటాం. మీడియా అసత్య ప్రచారాలెందుకు. ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పైనా మీ ప్రేలాపనలు. ఉద్యమం నుంచి వచ్చినోళ్లం కేసులకు భయపడతామా. మహా న్యూస్‌పై దాడి చేశారని ముసలి కన్నీరు కారుస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్‌పై అక్కసుతో అదేపనిగా పెట్టుకొని దాడులు చేస్తున్నారు. నిన్న జరిగింది దాడి కాదు.. నిరసన మాత్రమే. మా సహనానికి పరీక్ష పెట్టొద్దు. మీడియా ముసుగులో మీ ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు. బిన్ లాడెన్ లాగా ఎక్కడ దాక్కున్నా పట్టుకొని మీపని చెప్తాం. మా దాడి వేరే విధంగా ఉంటది. కేసీఆర్‌ది మొదటినుంచి గొప్ప క్షమాగుణం. ఆయన క్షమించినా మేము క్షమించం. భేషరతుగా మహా న్యూస్ యాజమాన్యం కేసీఆర్, కేటీఆర్‌కు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్‌ చేశారు.

ఇది కూడా చూడండి: Sexual Harassment : ఉద్యోగం ఆశ జూపి అత్యాచారం..పద్మ అవార్డు గ్రహీతపై ఆరోపణలు
 
 కాగా  ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ తప్పుడు కథనాలు వేస్తున్నారని పలువురు బీఆర్ఎస్ నేతలు శనివారం హైదరాబాద్‌లోని మహా న్యూస్ ఆఫీస్‌పై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా అనేక మంది ఖండించారు. తాజాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎల్లో మీడియాను కేసీఆర్ క్షమించినా మేము వదిలిపెట్టబోమని హెచ్చరించారు.  

ఇది కూడా చూడండి: Shefali Jariwala: గుండె పోటు కాదు.. షఫాలీ పోస్ట్‌మార్టంలో బయటపడ్డ సంచలనాలు!

 

guntakandla-jagadish-reddy | suryapet | BRS Leaders Attack On Mahaa TV office | mahaa tv new | BRS Leaders Attack On Mahaa TV | Mahaa TV office | Mahaa News | brs mla jagadishreddy | brs

Advertisment
Advertisment
తాజా కథనాలు