States debts: అప్పుల ఊబిలో 8 రాష్ట్రాలు.. తెలంగాణ, ఏపీకి ఎంత బాకీ ఉందో తెలుసా!

రాష్ట్రాల అప్పు భారీగా పెరిగిపోతోందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. ఇందుకు సంబంధించిన అప్పుల డేటాను విడుదల చేసింది. తమిళనాడు 8.3 లక్షల కోట్లతో 1 స్థానంలో ఉంది. తెలంగాణ 5.4 లక్షల కోట్లతో 7వ, ఏపీ 4.9 లక్షల కోట్లతో 8వ స్థానంలో ఉన్నాయి.  

New Update

States debts: దేశంలో అనేక రాష్ట్రాల్లో అప్పుల భారీ పెరిగిపోతోందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల తెలిపింది. అందుకు సంబంధించిన అప్పుల డేటాను కూడా విడుదల చేసింది. అయితే గత 5 సంవత్సరాలలో పలు రాష్ట్రాల్లో అప్పుల భారీ పెరుగుదల ఉందని ఆర్బీఐ చెబుతోంది. రాష్ట్రాల్లో అప్పుల భారం దాదాపు 74% పెరుగుదల ఉందని ఇటీవల గణాంకాలు వెల్లడించింది. వీటితో పాటు ఏఏ రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయే స్పష్టమైన జాబితా రిలీజ్ చేసింది.  అందులో తెలంగాణ, ఏపీ స్థానం ఎంత? అసెంబ్లీ వేదికగా తెలంగాణ ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క చెప్పింది నిజమేనా? ఈ లెక్కలు చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. 

కేంద్రపాలిత ప్రాంతాల అప్పు 83.3 లక్షల కోట్లు..

2019 సంవత్సరంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అప్పులు 47.9 లక్షల కోట్లు. కానీ ఇప్పుడు అది 83.3 లక్షల కోట్లకు పెరిగింది. 2024లో భారతదేశంలో అత్యధికంగా అప్పులు ఉన్న రాష్ట్రాల్లో.. తమిళనాడు 8.3 లక్షల కోట్ల అప్పుతో 1 స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్ 2 స్థానంలో ఉంది. యూపీ అప్పు 7.7 లక్షల కోట్లు. ఇక 7.2 లక్షల కోట్ల అప్పులతో మహారాష్ట్ర 3 స్థానంలో ఉంది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ 6.6 లక్షల కోట్ల అప్పులతో 4 స్థానంలో ఉంది. అలాగే 6 లక్షల కోట్లతో కర్ణాటక 5 స్థానంలో, రాజస్థాన్ 5.6 లక్షల కోట్లతో 6 స్థానంలో కొనసాగుతోంది. ఇక తెలంగాణ విషయానికొస్తే.. 5,04 లక్షల కోట్లతో 7వ స్థానంలో ఉంది.  ఆంధ్రప్రదేశ్  4.9 లక్షల కోట్లతో 8వ స్థానంలో కొనసాగుతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా తెలిపింది. 

తెలంగాణ అంచనా 5,04, 814 కోట్లు..

అయితే తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగం వేళ 2024 -2023 వరకు రాష్ట్రంలో ఆర్దిక నిర్వహణ.. అప్పుల పైన బడ్జెట్ లో ప్రత్యేకంగా ప్రస్తావన చేశారు. గాడి తప్పిన వ్యవస్థలను సక్రమార్గంలో పెడుతున్నామని చెప్పుకొచ్చారు. సంక్షేమంతో పాటుగా తెలంగాణ సుస్థిర అభివృద్ధి కోసం పనిచేస్తున్నామన్నారు. ఈ ఆర్థిక ఏడాది ముగిసే నాటికి (మార్చి-2026) అప్పుల అంచనా 5,04, 814 కోట్లుగా ఉంటుందని తెలిపారు. ఇక రాష్ట్ర సొంత పన్నుల రాబడి అంచనా 1,45,419 కోట్లుగా అంచనా వేయగా బడ్జెట్‌లో రుణాలు 69,639 కోట్లుగా ప్రతిపాదించారు. కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.29,899 కోట్లు వస్తాయని తెలిపారు. 

Also Read: అమెరికా విద్యాశాఖ మూసివేత..కీలక ఆదేశాలు జారీ చేసిన ట్రంప్‌!

ఏపీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఆదాయం కంటే వ్యయం భారీగా పెరిగింది. దీంతో నగదు అందుబాటులో లేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. నగదు అందుబాటులో లేకపోవడం వల్ల ఓవర్‌ డ్రాఫ్ట్‌, వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సులపై ఆధారపడాల్సి వస్తోంది. మార్కెట్‌ రుణాలపై ఏపీ ఎక్కువగా ఆధారపడుతోందని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ (National Institute of Public Finance)’ తెలిపింది.

Also Read: హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు బాధాకరం.. మైనర్ బాలిక ఇష్యూపై కేంద్రమంత్రి అసహనం!

reserve-bank | high debts | telangana-debts | today telugu news | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు