/rtv/media/media_files/2025/06/02/s7LOQeIowz163uTGxqch.jpg)
pbks and mi emotional video
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (ఆదివారం) ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టు ఘన విజయం సాధించింది. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై జట్టును క్వాలిఫయర్ 2లో ఓడించి ‘కింగ్స్’ టీం ఫైనల్కు దూసుకెళ్లింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్తో పంజాబ్ విజయం సాధించింది.
Also Read: మమతా పాలనలో దారుణాలు.. బెంగాల్లో అధికారం మాదే: అమిత్ షా
పంజాబ్ vs ఎంఐ ఎమోషనల్ వీడియో
ఇక మ్యాచ్ అనంతరం ఐపీఎల్ అకౌంట్ నుంచి ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ అయింది. అందులో ఓటమి పాలైన ముంబై జట్టు ఎమోషన్ సీన్లు, గెలిచిన పంజాబ్ జట్టు హ్యాపీ మూమెంట్ ఉన్నాయి. మ్యాచ్లో ఆఖరి బాల్ కొట్టి విజయం సాధించిన తర్వాత శ్రేయాస్, పంజాబ్ కింగ్స్ జట్టులో ఆనందం వెల్లువిరిసింది. మరోవైపు ఓటమిపాలైన ముంబై జట్టు ప్లేయర్ల ఎమోషన్ క్లిప్పింగ్స్ వైరల్గా మారాయి.
A 1⃣1⃣ year wait ends... 🥹#PBKS are in the #TATAIPL 2025 Final and who better than Captain Shreyas Iyer to take them through ❤
— IndianPremierLeague (@IPL) June 1, 2025
Scorecard ▶ https://t.co/vIzPVlDqoC#PBKSvMI | #Qualifier2 | #TheLastMile | @PunjabKingsIPL pic.twitter.com/vILymKxqXp
Also Read: జ్యోతి మల్హోత్రా కేరళ టూర్కు సీఎం అల్లుడే స్పాన్సర్.. బీజేపీ సంచలన ఆరోపణలు
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో శ్రేయాస్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 41 బంతుల్లోనే 87 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అందులో 5 ఫోర్లు, ఎనిమిది సిక్సులు ఉన్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ 44 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 44 పరుగులు, బెయిర్స్టో 38 పరుగులు, నమన్ ధీర్ 37 పరుగులు చేశారు.
అనంతరం ఛేజింగ్కు దిగిన ‘కింగ్స్’ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ 6 పరుగులకే వెనుదిరిగాడు. కానీ పంజాబ్ విశ్వాసంతోనే ముందుకు సాగింది. ఇంగ్లిస్ చక్కటి షాట్లతో 38 పరుగులు, నేహాల్ వధేరా 48 పరుగులు చేయడంతో శ్రేయాస్కు కాస్త భారం తగ్గింది. దీంతో తనదైన భారీ షాట్లతో శ్రేయాస్ చెలరేగిపోయాడు.
Also Read : దర్శకుడు విక్రమ్ సుకుమారన్ కన్నుమూత