TG Crime: సిరిసిల్లలో విషాదం.. బిడ్డ శారీ ఫంక్షన్ ఘనంగా చేయలేదని.. ఫ్యాన్ కు ఉరేసుకున్న తల్లి!

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో కూతురి శారీ ఫంక్షన్ ఘనంగా జరపలేదని మనస్తాపం చెందిన ఒక తల్లి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మృతురాలు లావణ్య ఫ్యానుకు ఉరివేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
hanging hyderabad

Rajanna Siricilla Crime News

అమ్మాయిల శారీ ఫంక్షన్(Saree Function).. మన సంస్కృతిలో అందమైన, ముఖ్యమైన వేడుక. ఈ వేడుకను శారీ ఫంక్షన్ లేదా చీర వేడుక అని కూడా పిలుస్తారు. ఈ ఫంక్షన్ అమ్మాయిలు యుక్తవయస్సులోకి అడుగుపెడుతున్నప్పుడు జరుపుకుంటారు. వారి జీవితంలో ఇదొక కొత్త అధ్యాయం. ఈ వేడుకలో బంధువులు, స్నేహితులు అందరూ కలిసి అమ్మాయిని కొత్త బట్టలు, నగలతో అలంకరిస్తారు. ఈ రోజున అమ్మాయి మొదటిసారిగా చీర కట్టుకుంటుంది. ఇది ఒక మధురమైన జ్ఞాపకం. ఈ వేడుక కేవలం చీర కట్టడం మాత్రమే కాదు.. సంప్రదాయాలు, విలువలు, కుటుంబ బంధాలను తెలియజేస్తుంది. ఈ వేడుక ద్వారా అమ్మాయికి ఆశీస్సులు అందించి, ఆమె భవిష్యత్తు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అయితే తెలంగాణలో శారీ ఫంక్షన్ వేడుక ఓ ఇంట్లో విషాదాన్ని నింపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

తక్కువ ఖర్చుతో కూతురి శారీ ఫంక్షన్..

రాజన్న సిరిసిల్ల(rajanna sircilla) జిల్లాలో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కూతురి శారీ ఫంక్షన్ ఘనంగా జరపలేదని మనస్తాపం చెందిన ఒక తల్లి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన భాస్కర్, లావణ్య దంపతులకు ఇటీవల కూతురి శారీ ఫంక్షన్ జరిగింది. కూతురి ఫంక్షన్ ఘనంగా చేయాలని తల్లి లావణ్య ఎంతో కోరుకున్నారు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు.. అదే సమయంలో గృహప్రవేశం కూడా ఉండటంతో తక్కువ ఖర్చుతో కూతురి ఫంక్షన్ ముగించేద్దామని భర్త భాస్కర్ సూచించారు.

ఇది కూడా చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 32 మంది

భర్త సూచన మేరకు ఫంక్షన్ సాధారణంగా జరగడంతో లావణ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కూతురి కోసం ఎంతో ఆశపడిన ఫంక్షన్ ఇలా సాధారణంగా ముగిసిపోవడంతో ఆమె తట్టుకోలేకపోయారు. ఈ మనోవేదనతో సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కూతురి ఫంక్షన్ ఘనంగా జరపలేదనే మనస్తాపంతో తల్లి ఆత్మహత్య చేసుకోవడం ఆ గ్రామంలో విషాదం నింపింది. లావణ్య మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: తాకట్టు పెట్టిన 25 తులాల బంగారంతో బెట్టింగ్.. మంచిర్యాల SBI మేనేజర్, క్యాషియర్ నిర్వాకం!

Advertisment
తాజా కథనాలు