/rtv/media/media_files/2025/05/10/DHYAlD0qXjndBflEIEoa.jpg)
Rain Alert
తెలంగాణలో పలు జిల్లాలో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్పింది. శనివారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో సహా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదరు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.
Also Read: ఆపరేషన్ సిందూర్...ఐదుగురు పాకిస్తానీ ఉగ్రవాదులు హతం!
ఇక రానున్న రెండ్రోజుల పాటు కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 33 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Also Read: దాడులు ఆపితే ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధం.. పాక్ కాళ్ల భేరం!
ఇక ఏపీలో చూసుకుంటే శుక్రవారం పలు ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్కడ మే 12 నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.
Also Read: ఎయిర్ రైడ్ సైరన్లను మీడియాలో చూపించొద్దు.. కేంద్రం కీలక ప్రకటన
Also Read: వెళ్లి భారత్ తో మాట్లాడండి.. పాక్ కు అమెరికా కీలక సూచన!
telugu-news | rtv-news | telangana | weather