/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం(Bus Accident) జరగకముందే మరో ఘోరం జరిగింది. హైదరాబాద్ ORRపై ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. మియాపూర్ నుంచి గుంటూరుకు 20 మంది ప్రయాణికులతో వెళ్తున్న న్యూ గో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురి ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. . వరుసగా బస్సు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.
ఓవర్టేక్ చేయబోయి
మరోవైపు ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(private-travels-bus) ప్రమాదానికి గురైంది. నెల్లూరులో లారీని ఓవర్టేక్ చేయబోయి ఐరన్ బారికేడ్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద చోటుచేసుకుంది. ఐరన్ బారికేడ్ లేకపోతే బస్సు పల్టీ కొట్టే ప్రమాదం ఉండేది.
Also Read: 'బాహుబలి: ది ఎపిక్'కు కళ్లు చెదిరేలా హైదరాబాద్ బుకింగ్స్..!
ఈ ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో పాటు 34మంది ప్రయాణికులన్నారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే బస్సులోని ప్రయాణికులను ఇతర వాహనాల్లో తరలించారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Follow Us