విద్యార్థుల తల్లిదండ్రులు టీవీ సీరియల్స్ చూడటం బంద్ చేసి, విద్యార్థులకు సహకరిం చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. విద్యా రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
నల్లగుట్ట, బాలంరాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి ఆయన సందర్శించారు. ఎఫ్ఎల్ఎన్, ఏఎక్స్ఎల్, ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్ ,సైన్స్ ల్యాబ్ లను ఆయన పరిశీలించారు. అనంతరం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
పరీక్షలు బాగా రాయాలని విద్యార్థులకు చెప్పారు. విద్యారంగం ప్రాముఖ్యతను గుర్తించి ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని, ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్ ద్వారా విద్యార్థుల పర్ఫామెన్స్ ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చని అన్నారు.
నేటి నుండి పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. మీరందరూ జీవితంలో ఏ పరీక్షలు రాసిన ఏ ఉన్నత శిఖరాలకు వెళ్ళిన పదవ తరగతి పరీక్షల మార్కుల మేమో ముఖ్యమైంది.కాబట్టి అందరూ కస్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని మంత్రి తెలిపారు. పిల్లలు చదువుకోవడానికి మంచి అవకాశం ఇచ్చి పిల్లల ఉజ్వల భవిష్యత్ కి తోడ్పడాలి. విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని ప్రభుత్వం పక్షాన ఆశీర్వాదం అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
Also Read: Horoscope: ఈ రాశివారు ఈరోజు ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది!
Also Read: America-Trump: అమెరికా విద్యాశాఖ మూసివేత..కీలక ఆదేశాలు జారీ చేసిన ట్రంప్!
ponnam-prabhakar | Minister Ponnam Prabhakar | latest-news | latest-telugu-news | latest telugu news updates