/rtv/media/media_files/2025/05/17/7PzlBMqsta0MoDEjmaW3.jpg)
Minister Sridhar Babu
కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబుతో సహా 13 మంది కాంగ్రెస్ నేతలపై గతంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. 2017లో ఈ కాంగ్రెస్ నేతలపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసులు పెట్టింది. అప్పటినుంచి ఈ కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. అయితే తాజాగా ఈ కేసును పరిశీలించిన కోర్టు.. మంత్రి శ్రీధర్ బాబుతో సహా 13 మందిపై నమోదైన కేసును కొట్టివేసింది.
Also read: టర్కీకి ఓవైసీ సీరియస్ వార్నింగ్.. ఆ విషయం గుర్తు పెట్టుకోవాలంటూ.. !
Nampally Court Dismisses Case - Minister Sridhar Babu
దీనిపై మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. భూములు కోల్పోతున్న రైతుల పక్షాన పోరాడితే తమపై కేసులు పెట్టారని విమర్శించారు. చివరికి న్యాయమే గెలిచిందని అన్నారు. '' కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్లో రైతుల హక్కుల కోసం వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లాం. కానీ అధికారం ఉందని తమపై వివిధ సెక్షన్ల కింద అన్యాయంగా కేసులు పెట్టారు. 8 ఏళ్లుగా ఈ కేసు నడిచింది.
తాజాగా ఆ కేసును కోర్టు కొట్టివేసింది. ఇది రైతుల విజయం. అధికారం ఉందని అప్పుడు కేసులు పెట్టి.. పోలీసులను ఎలా పడితే అలా వాడుకున్నారు. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది. చట్టాలను నమ్ముతూ మేము ముందుకెళ్తున్నాం. మాకు అధికారం ఉందని దాన్ని దుర్వినియోగం చేయలేదు. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూడా నిలవలేదు. దానిపై కూడా విచారణ జరుగుతోంది. తప్పు చేసినవాళ్లు..శిక్ష అనుభవించాల్సిందేనని'' శ్రీధర్ బాబు అన్నారు.
Also Read: తుర్కియేకు భారత్ మరో గట్టి దెబ్బ.. రూ.770 కోట్లు లాస్
Also Read: బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? మరోసారి హరీశ్ రావు ఇంటికి కేటీఆర్
latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news live updates