/rtv/media/media_files/2025/05/17/lpoMpCjmqxQcDkUJLcRZ.jpg)
youtuber Jyoti Malhotra working as spy to Pakistani intelligence
Jyoti malhotra: పాకిస్థాన్ గూఢచారులకు స్పైగా పనిచేస్తున్న ఆరోపణలతో హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు పాకిస్థాన్ గూఢచారులు సమాచారం చేరవేస్తున్న మరో ఐదుగురు భారతీయులను అదుపులోకి తీసుకున్నారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో వీరి నెట్ వర్క్ విస్తరించి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read : టర్కీకి ఓవైసీ సీరియస్ వార్నింగ్.. ఆ విషయం గుర్తు పెట్టుకోవాలంటూ.. !
Also Read : వణుకు పుట్టిస్తున్న తమన్నా కొత్త మూవీ పోస్టర్..
పాకిస్థాన్ స్పై గా
‘Travel with Jo’ అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న జ్యోతి మల్హోత్రా.. 2023లో కమీషన్ ఏజెంట్ల సహాయంతో పాకిస్థాన్ వెళ్లారు. అక్కడ ఆమె పాక్ హైకమిషన్లో పని చేసిన ఎహ్సాన్-ఉర్-రహీమ్ అలియాస్ దానిష్ అనే వ్యక్తితో సన్నిహితంగా మమేకమయ్యారు. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి వాటిలో "జట్ రంధావా" పేరుతో సేవ్ చేసిన శాకిర్ అలియాస్ రాణా షహబాజ్ అనే పాకిస్థాన్ గూఢచారితో నిరంతరం టచ్లో ఉండేవారని సమాచారం.
Also Read : ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల అరెస్ట్
YouTuber Jyoti Malhotra is arrested over espionage charges. She used to make deshbhakti reels near army installations and movements. The question is who even allowed her near sensitive areas during war. Such privilege can only be granted if you have good connections pic.twitter.com/HJGzlq2D7t
— Hindutva Knight (@HPhobiaWatch) May 17, 2025
కాగా.. ఇప్పుడు ఇండియా- పాక్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ.. జ్యోతి తన సోషల్ మీడియా ద్వారా భారతదేశానికి చెందిన కొన్ని సున్నితమైన ప్రాంతాల వివరాలను పాక్ గూఢచారులకు అందించినట్లు తెలిసింది. అంతేకాదు .. పాకిస్థాన్పై పాజిటివ్ ఇమేజ్ చూపించేలా సోషల్ మీడియా ద్వారా ప్రచారం కూడా నిర్వహించారని ఆరోపణలు ఉన్నాయి.
గతంలో జ్యోతి పాకిస్థాన్ లోని లాహోర్ లో స్ట్రీట్ షాపింగ్, ఫుడ్ వ్లాగింగ్ వీడియోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. జ్యోతితో పాటు గుజాలా, బాను నస్రీనా, యామీన్ మహ్మద్, అర్మాన్ మొత్తం ఐదు మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి మల్హోత్రాపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 152, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923 లోని సెక్షన్లు 3, 4, 5 కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. అంతేకాదు ఆమె దీని గురించి ఒప్పుకుంటూ రాతపూర్వకమైన నిర్దారణ కూడా అందించినట్లు అధికారులు తెలిపారు.
మరో నిందితురాలు గుజాలా అనే యువతి పాక్ హైకమిషన్లోని దానిష్తో ప్రేమ, పెళ్లి హామీలతో మోసపోయి.. దేశానికి సంబంధించిన సమాచారం లీక్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే దవిందర్ సింగ్ ధిల్లాన్ అనే నిందితుడు పటియాలా సైనిక స్థావరం వీడియోలను పాక్ గూఢచారులకు పంపించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ కేసు భారతదేశ భద్రతకు సంబంధించిన ది కావడంతో కేంద్ర ప్రభుత్వం అత్యంత శ్రద్ధ వహిస్తోంది. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం.
Also Read : గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇవ్వాలని నగ్నంగా మొబైల్ షాప్లోకి దూరాడు.. చివరికి!
telugu-news | operation Sindoor | latest-news | youtuber jyoti malhotra