/rtv/media/media_files/2025/02/20/VjgPhTTjq7gFKRigmOSo.jpg)
Maganti Gopinath
Maganti Gopinath: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం మరింత విషమించింది. ఆయనకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. గోపినాథ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దానికి చికిత్స కూడా తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన కార్డియాక్ అరెస్టుకు గురైనట్లు వెల్లడించారు.
Also Read: సినిమా కాదు రియల్.. ఒకేసారి 10మందిని మింగేయగల భారీ అనకొండ!
వెంటనే వైద్యులు సీపీఆర్ చేయడంతో తిరిగి గుండె కోట్టుకోవడం, నాడి, బీపీ సాధారణ స్థితికి వచ్చింది. అనంతరం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. మాగంటి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. 48 గంటల తర్వాత ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. గోపినాథ్ కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మూడు నెలల క్రితం కూడా ఏఐజీలో చేరారు. అప్పట్లో డయాలసిస్ చేయించుకున్నట్లు సమాచారం.
Also Read: భారత్లో 3000 మంది పాక్ స్పైలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
మాగంటికి గుండెపోటు వచ్చిన సమాచారం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, నామా నాగేశ్వరరావు, కేపీ వివేకానందగౌడ్, మాధవరం కృష్ణారావు, దాసోజు శ్రవణ్, పార్టీ కార్యకర్తలు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం హరీశ్రావు ఇతర నేతలు మీడియాతో మాట్లాడారు. మాగంటి కోలుకుంటున్నారని చెప్పారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని వెల్లడించారు. మీడియా అత్యుత్సహంతో తప్పుడు వార్తలు ప్రసారం చేస్తుందని మండిపడ్డారు. ఆయన త్వరగా కోలుకొని తిరిగి ప్రజాసేవకు అంకితం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు.
ఆరా తీసిన కేటీఆర్
కాగా మాగంటికి గుండెపోటు వచ్చిన విషయం తెలిసిన వెంటనే విదేశీ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎంక్వయిరీ చేశారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. ఏఐజీ ఆస్పత్రి వైద్య బృందంతోనూ మాట్లాడిన కేటీఆర్ ఫోన్లో గోపినాథ్కు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కాగా వైద్యులు సైతం అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడే అవకాశం ఉందని కేటీఆర్కు వివరించారు.
Also Read: కుమార్తెను వేధిస్తున్నాడని.. బాలుడిని కొట్టి కొట్టి హత్య