ఏఐజీ ఆసుపత్రికి హరీష్ రావు | MLA Maganti Gopinath Passed Away | RTV
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి హైదరాబాద్ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎమ్మెల్యే అకాల మరణంపై ఆమె సంతాపం తెలిపారు. గోపినాథ్ తనయుడు వాత్యల్య నాథ్. హిమాన్ష్ స్నేహితులు కావడంతో కేటీఆర్ వెంట హిమాన్ష్ వెళ్లాడు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మూడు సార్లు పనిచేసిన మాగంటి గోపీనాథ్ రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టిన తీరు ఆసక్తికరం. 1983లో తొలిసారి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక గోపీనాథ్ తెలుగుదేశం పార్టీపై అభిమానం పెంచుకున్నారు. అలా టీడీపీ కార్యకర్తగా మారారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గురువారం గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం మరింత విషమించింది. ఆయనకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీకి తరలించారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలో ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఒక వ్యక్తి పై ఐదుగురు వ్యక్తులు దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో వచ్చిన దృశ్యాల ఆధారంగా ఈ కేసును సుమోటోగా స్వీకరించమని జుబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ ఆర్టీవీతో మాట్లాడారు.
మాగంటి గోపినాథ్ అనుచరుడు, పీఏగా ఉన్న భాస్కర్ అనే వ్యక్తి నడిరోడ్డు మీద ఓ వ్యక్తిని విచక్షణారహితంగా కొడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాను కొట్టడమే కాకుండా తన స్నేహితులతో కూడా ఆ వ్యక్తిని కొట్టిస్తున్నాడు.