/rtv/media/media_files/2025/05/06/25Aqy76StMKBRVO6lPrT.jpg)
Balvinder Singh Sahni
ఆర్ఎస్జీ ప్రాపర్టీ డెవలప్మెంట్ కంపెనీ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ అయిన బల్వీందర్ సింగ్ ప్రస్తుతం కటకటాల వెనుక ఉన్నారు. ఈ భారత బిలియనీర్ మీద బోలెడు నేరారోపణలు ఉన్నాయి. దుబాయ్ లో షెల్ కంపెనీలు, ఫోర్జరీ ఇన్వాయిస్లతో 150 మిలియన్ దిర్హమ్ల అంటే దాదాపు రూ.340 కోట్ల మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో బల్వీందర్ మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. 2024లో కేసులో నమోదవ్వగా ఈరోజు దుబాయ్ న్యాయస్థానం తుది తీర్పును ఇచ్చింది. బల్వీందర్ ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు రుజవు అవడంతో దుబాయ్ ఫోర్త్ క్రిమినల్ కోర్టు తీర్పు వెలువరించింది.
దేశం నుంచి పొండి..
ఈ మనీలాండరింగ్ కేసులో బిలియనీర్ బల్వీందర్ తో పాటూ మరికొందరు కూడా ఉన్నారు. అందరినీ న్యాయస్థానం దోషులుగా తేల్చింది. ఇందులో బల్వీందర్ కు మాత్రం రూ. 1.14 కోట్లు జరిమానా విధించింది. దాంతో పాటూ ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. అంతేకాదు అతని ఆస్తులన్నింటినీ జప్తు చేసి...దేశం నుంచి కూడా బహిష్కరించాలని న్యాయస్థానం చెప్పింది. శిక్ష పూర్తయ్యాక అతను దుబాయ్ వదిలి వెళ్ళిపవాలని తీర్పు ఇచ్చింది. బల్వీందర్ ఆస్తులు మొత్తం 340 కోట్లను కోర్టు జప్తు చేయాలని ఆదేశాలను జారీ చేసింది. శిక్ష పడిన వారిలో బల్వీందర్ పెద్ద కొడుకు కూడా ఉన్నాడు. రాజ్ సాహ్నీ గ్రూప్ అనేది బల్వీంవర్ కు చెందిన కంపెనీ. ఇదొక ప్రాపర్టీ డెవలప్ మెంట్ కంపెనీ. ఇది యూఏఈతో పాటు అమెరికా, భారత్ సహా పలు దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. బల్వీందర్ కు దుబాయ్ లో ఖరీదైన ఇళ్ళు, వాణిజ్య భనాలు, ఫైవ్ స్టర్ హోటల్ లాంటివి ఉన్నాయి. దుబాయ్ ఎలైట్ సర్కిల్లో ఇతను అబు సబాహ్ గా పేరు కూడా ఉంది. 2016లో తన రోల్స్ రాయిస్ కార్ కోసం ఏకంగా దాదాపు రూ.75కోట్లతో నంబరు ప్లేట్ కొనుగోలు చేసి వార్తల్లోకి ఎక్కారు. ఇతని ఇన్స్టా ఖాతాకు 33 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
today-latest-news-in-telugu | dubai | billionaire | jail | money-landering
Also Read: Hacking: భారత రక్షణశాఖ వెబ్ సైట్లపై పాకిస్థానీ హ్యాకర్ల దాడి