/rtv/media/media_files/2025/02/16/EoSjOK6V1Bfj34ZNao0n.jpg)
KTR and Nirmala Sitharaman
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమేనని లేఖలో పేర్కొన్నారు. '' బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొన్న కష్టాలను తీర్చాం. తెలంగాణ దశదిశను మార్చేసి తరిగిపోని ఆస్తులు సృష్టించాం. దేశ చరిత్రలో అత్యధిక అప్పులు చేసినా మీరా మమ్మల్ని ప్రశ్నించేది.
Also Read: అమెరికా నుంచి ఇజ్రాయిల్కు చేరుకున్న MK-84 బాంబులు.. ఏ క్షణమైనా యుద్ధం..!
కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులన్నీ కార్పొరేట్ల లక్షల కోట్లు రుణాలు మాఫీ చేసేందుకే. ప్రతీ బడ్జెట్లో తెలంగాణకు తీవ్రంగా అన్యాయం చేస్తున్న బీజీపీని ప్రజలు ఎప్పటికీ క్షమించరు. మోదీ ప్రభుత్వం పదేళ్లలో రూ.125 లక్షల కోట్లు అప్పులు చేసింది. ఈ అప్పులతో ఏం చేశారో చెప్పాలని'' కేటీఆర్ లేఖలో డిమాండ్ చేశారు.
Also Read: షాకింగ్ న్యూస్.. కిడ్నాప్ చేసి మూత్రం తాగించిన ఎమ్మెల్యే!
ఇదిలాఉండగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల రాజ్యసభలో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ మిగులు బడ్జెట్తో ఉండేదని.. ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంత సహకరించినా కూడా ఆ రాష్ట్ర అప్పుల్లో నుంచి బయటకు రాలేకపోతోందని అన్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ కేంద్రమంత్రిగా బహరంగ లేఖ రాశారు.
Also Read: రేయ్ ఎవర్రా మీరంతా..! బర్డ్ఫ్లూ భయమే లేదు: ఊరంతా చికెన్ పండగే!
Also Read: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. శవాలతో రెండ్రోజులు ఉన్న వృద్ధురాలు